AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రాగన్ కంట్రీ వక్రబుద్ధి.. మరోసారి సరిహద్దు దాటిన చైనా దళాలు..

డ్రాగన్ కంట్రీ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. భారత సరిహద్దులను దాటి మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎల్‌ఏసీని దాటి చైనా పీఎల్ఏ బలగాలు...

డ్రాగన్ కంట్రీ వక్రబుద్ధి.. మరోసారి సరిహద్దు దాటిన చైనా దళాలు..
Ravi Kiran
|

Updated on: Jun 18, 2020 | 10:06 PM

Share

డ్రాగన్ కంట్రీ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. భారత సరిహద్దులను దాటి మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎల్‌ఏసీని దాటి చైనా పీఎల్ఏ బలగాలు భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. ఇదిలా ఉంటే తూర్పు లదాఖ్‌లోని గాల్వన్ లోయలో దళాలను ఉపసంహరించడం, పరిస్థితులను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడంపై భారత్, చైనా దళాలు మేజర్ జనరల్స్ స్థాయిలో దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు.

గాల్వన్ వ్యాలీలో సోమవారం సాయంత్రం భారత్, చైనా దళాల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనలో ఒక కల్నల్, 19 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. కాగా, గాల్వన్ లోయ సమీపంలో మంగళవారం, బుధవారం ఇరుదేశాల మధ్య చర్చలు ప్రతిష్టంభనతో ముగిసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈరోజు జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్న దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!

సుశాంత్ ఓ క్రేజీ జీనియస్.. బాలీవుడ్‌నే అతను దూరం పెట్టాడు..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!

దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని..

బ్రేకింగ్: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ అద్భుత విజయం..

Follow Us