AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్-19 కొత్త గైడ్ లైన్స్ ని ప్రకటించిన కేంద్రం, కంటెయిన్మెంట్ జోన్లలో ఆంక్షలు ఇంకా కఠినం !

కోవిడ్-19 నూతన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి వీటిని ఆయా రాష్ట్రాలు, ముఖ్యంగా కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వీటిని పాటించాలని..

కోవిడ్-19 కొత్త గైడ్ లైన్స్ ని ప్రకటించిన కేంద్రం, కంటెయిన్మెంట్ జోన్లలో ఆంక్షలు ఇంకా కఠినం !
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 25, 2020 | 6:36 PM

Share

కోవిడ్-19 నూతన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. డిసెంబరు 1 నుంచి వీటిని ఆయా రాష్ట్రాలు, ముఖ్యంగా కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వీటిని పాటించాలని సూచించింది. కంటెయిన్మెంట్ జోన్లలో ఆంక్షలు మరింత కఠిన తరం చేయాలని,  కోవిడ్ సేఫ్టీ రూల్స్ పాటించని వారికి   జరిమానాలు రెట్టింపు చేయాలని, కరోనా వైరస్ ని సాధ్యమైనంత వరకు అదుపు చేసేలా నడవడికను అలవరచుకోవాలని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ కేసులు 92 లక్షలకు పైగా పెరిగిపోవడంతో కేంద్ర హోమ్ శాఖ తాజాగా  గైడ్ లైన్స్ ని విడుదల చేయడం విశేషం. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగిపోవడాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఇక రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్ఛే నెల 1 నుంచి రాత్రి వేళ కర్ఫ్యూ విదించనున్నారు. అలాగే మాస్కులు ధరించనివారికి జరిమానాను వెయ్యి రూపాయలు పెంచనున్నారు. ఇక మార్కెట్లు, బజార్లకు సంబంధించి కేంద్రం వేరుగా గైడ్ లైన్స్ జారీ చేసే యోచనలో ఉంది.

ప్రపంచంలో ఇప్పుడు రెండో అతి పెద్ద కోవిడ్ హిట్ దేశంగా ఇండియా మారింది. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందినవారి సంఖ్య లక్షా 34 వేలకు చేరిందని ప్రభుత్వ వర్గాల అంచనా. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు అయిదున్నర లక్షలకు పెరిగాయి.

Follow Us