AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్రివిధ దళాలకు 500 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో భారత, చైనా మధ్య ఘర్షణాత్మక వైఖరి కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైనా అత్యవసర

త్రివిధ దళాలకు 500 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2020 | 7:39 PM

Share

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో భారత, చైనా మధ్య ఘర్షణాత్మక వైఖరి కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే త్రివిధ దళాల అవసరాల నిమిత్తమై కేంద్ర ప్రభుత్వం ఆదివారం 500 కోట్లను కేటాయించింది. అత్యంత విపత్కర పరిస్థితులు తలెత్తితే నూతన ఆయుధాలు కొనుగోలు, తదితర అవసరాల నిమిత్తమై దీనిని విడుదల చేసినట్లు అత్యున్నత వర్గాలు ప్రకటించాయి.

గాల్వన్ లోయలో ఇండో-చైనా ఘర్షణల నేపథ్యంలో ‘‘త్రివిధ దళాలకూ అత్యవసర సమయంలో ఆయుధాల కొనుగోలుకై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 500 కోట్లను కేటాయించింది. ఇప్పుడు అత్యవసర పరిస్థితి నిమిత్తమై ఎలాంటి ఆయుధాన్నైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు కింద రక్షణ దళాలు సైనిక వ్యవహారాల శాఖతో సంప్రదించి, యుద్ధానికి అవసరమయ్యే, లేదా వారి జాబితాలో ఉండే ఆయుధాల కొనుగోళ్లు చేయవచ్చు.’’ అని అధికారులు ప్రకటించారు. అయితే త్రివిధ దళాలు కూడా ఇప్పటికే తమకు అవసరమైన వాటి జాబితాను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.