Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..బైక్ను ఢీకొన్న కారు.. తల్లీకొడుకు దుర్మరణం
పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం కారు, బైక్ ఢీకొని తల్లీకుమారుడు దుర్మరణం పాలయ్యారు.
Peddapalli Road Accident: పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు, బైక్ ఢీకొని తల్లీకుమారుడు దుర్మరణం పాలయ్యారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగపల్లి గ్రామానికి చెందిన దబ్బేట నాగరాజు (23) తల్లి రాజేశ్వరి (50) తో కలిసి బైక్పై మంథని వైపు వెళ్తున్నాడు. బట్టుపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు వీరు ప్రయాణిస్తున్న బైక్నను ఢీకొట్టింది. దీంతో తల్లీకొడుకు ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడిక్కక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.