ఫలితాల ముందు అల్లర్లు జరిగే అవకాశం.. రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్ర హోం శాఖ

సార్వ్రతిక ఎన్నకల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ.. రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను అలర్ట్ చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో హింస జరిగే అవకాశాలున్నందున రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా భద్రతకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచిచింది. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటిగ్ కేంద్రాల వద్ద తగు భద్రతా చర్యలు చేపట్టాలని […]

ఫలితాల ముందు అల్లర్లు జరిగే అవకాశం.. రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్ర హోం శాఖ
Follow us

| Edited By:

Updated on: May 22, 2019 | 7:13 PM

సార్వ్రతిక ఎన్నకల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ.. రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను అలర్ట్ చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో హింస జరిగే అవకాశాలున్నందున రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా భద్రతకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచిచింది. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటిగ్ కేంద్రాల వద్ద తగు భద్రతా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించింది. ఏడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లను రేపు లెక్కించి, ఫలితాలను ప్రకటించనున్నారు.