AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్: భారీగా పెరిగిన గేమింగ్ యాప్స్ వినియోగం..!

భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఫలితంగా పుస్తకాలు చదవడం, కామిక్స్ చూడడం

కరోనా ఎఫెక్ట్: భారీగా పెరిగిన గేమింగ్ యాప్స్ వినియోగం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2020 | 11:02 PM

Share

భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఫలితంగా పుస్తకాలు చదవడం, కామిక్స్ చూడడం, గేమింగ్ యాప్స్ వినియోగం ఎక్కువైంది. గత రెండు నెలలుగా మొబైల్ బ్రౌజింగ్ యాప్ యాక్టివిటీ దాదాపు 40 శాతం పెరిగినట్టు ఓ నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో దేశం దాదాపు లాక్‌డౌన్ స్థితిలో ఉంది. ఇళ్లకే పరిమితమైన ప్రజలు మొబైల్స్‌కే పరిమితమై న్యూస్, సమాచారం, ఎంటర్‌టైన్మెంట్ వంటి వాటిని అందులోనే వెతుక్కుంటున్నారు. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన ‘ఇన్‌మోబి గ్రూప్’ నివేదిక వెల్లడించింది.

భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కన్జుమర్ ఇన్‌సైట్స్’ పేరుతో పలు విషయాలు వెల్లడించింది. జనవరి తొలి వారం నుంచి ఈ నెల 11 వరకు డేటా సిగ్నల్స్‌ను విశ్లేషించడం ద్వారా ఈ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లొకేషన్ ట్రెండ్స్, వినియోగదారుల ఇన్‌-యాప్ బిహేవియర్‌ను వెల్లడించింది. అది వెల్లడించిన వివరాల ప్రకారం.. బుక్స్, కామిక్ యాప్స్ వినియోగం 200 శాతం పెరగ్గా, గేమింగ్ యాప్స్ వినియోగం 110 శాతం పెరిగింది. ఇమేజ్, వీడియో ఎడిటింగ్ యాప్ వినియోగం 60 శాతం పెరిగింది. మొబైల్ బ్రౌజింగ్ యాప్ యాక్టివిటీ 37 శాతం పెరిగింది. మార్చి 5 నుంచి అయితే ఇమేజ్, వీడియో ఎడిటింగ్ యాప్ వినియోగం రాకెట్ స్పీడ్ అందుకుందని వివరించింది. ఫిబ్రవరి 12 నుంచి గేమింగ్ యాప్‌ల వినియోగం క్రమంగా పెరినట్టు పేర్కొంది.