బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: ఇన్‌సైడ్ రీసౌండ్

ఇంతకాలం వైసీపీ వాడిన ఆయుధాన్నే ఇప్పుడు టీడీపీ వాడుతోంది. అదే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌. అమరావతి విషయంలో వైసీపీ ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే, విశాఖ-విజయనగరం విషయంలో టీడీపీ దీన్నే కౌంటర్‌గా సంధించింది. ఈ రెండు జిల్లాల్లో వైసీపీ నేతలు 40వేల ఎకరాలు కొనుగోలు చేశారన్నది టీడీపీ నేత లోకేష్‌ చేస్తున్న బాంబింగ్‌. అంతేకాదు, అటు అమరావతిలోనూ, ఇటు రెండు జిల్లాల్లోనూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై హైకోర్టు జడ్జితో విచారణకు రెడీ అంటూ ఆయన సవాల్‌ చేస్తున్నారు. మరోవైపు అమరావతి రైతులు […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: ఇన్‌సైడ్ రీసౌండ్
Follow us

| Edited By:

Updated on: Dec 24, 2019 | 10:54 PM

ఇంతకాలం వైసీపీ వాడిన ఆయుధాన్నే ఇప్పుడు టీడీపీ వాడుతోంది. అదే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌. అమరావతి విషయంలో వైసీపీ ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే, విశాఖ-విజయనగరం విషయంలో టీడీపీ దీన్నే కౌంటర్‌గా సంధించింది. ఈ రెండు జిల్లాల్లో వైసీపీ నేతలు 40వేల ఎకరాలు కొనుగోలు చేశారన్నది టీడీపీ నేత లోకేష్‌ చేస్తున్న బాంబింగ్‌. అంతేకాదు, అటు అమరావతిలోనూ, ఇటు రెండు జిల్లాల్లోనూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై హైకోర్టు జడ్జితో విచారణకు రెడీ అంటూ ఆయన సవాల్‌ చేస్తున్నారు. మరోవైపు అమరావతి రైతులు రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నారు. అసలు ఈ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో నిజముందా? ఎంక్వైరీలు వేయకపోతే ఇది రాజకీయ అస్త్రంగానే మిగిలిపోతుందా అన్న అంశంపై ఇవాళ్టి బిగ్‌డిబేట్‌.

రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ వైసీపీ నేతల ఆరోపణలకు అదే ఫార్ములాతో బలమైన కౌంటర్లను టీడీపీ మొదలుపెట్టింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ మీద హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలంటూ రాజధాని రైతుల సమక్షంలో చంద్రబాబు సవాల్‌ విసిరారు. ఇదేసందర్భంలో.. రాజధాని రైతులకు మద్దతుగా మంగళగిరిలో జరిగిన కాగడాల ర్యాలీలో నారా లోకేష్‌ పాల్గొన్నారు. విశాఖ-విజయనగరం జిల్లాల్లో వైసీపీ నేతలు 40వేల ఎకరాల భూములను కొనుగోలు చేశారంటూ నారాలోకేష్‌ ట్విట్టర్‌లో విమర్శించారు. వీటిపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అయితే, అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరపాలన్న చంద్రబాబు డిమాండ్‌ను మంత్రి బొత్స తోసిపుచ్చారు.

అటు హైకోర్టును తరలించవద్దని అమరావతిలో న్యాయవాదులు ధర్నా చేశారు. ఇటు గుంటూరులో రాజధానిపై అఖిలపక్ష సమావేశం జరిగింది. రాజధాని తరలిపోతున్నప్పుడు వైసీపీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి, ఉపఎన్నికలకు వెళితే, తాము పోటీ పెట్టబోమని టీడీపీ ఆఫర్‌ ఇచ్చింది.

Latest Articles
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..