ఏడుగురు కుటుంబసభ్యులకు కరోనా
ఆంధ్రప్రదేశ్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండల పరిధిలోని జిన్నూరు గ్రామం భూపయ్య చెరువు కాలనీకి చెందిన ఓ వ్యక్తికి సోకిన కరోనా ఇంటిల్లిపాదికి అంటుకుంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండల పరిధిలోని జిన్నూరు గ్రామం భూపయ్య చెరువు కాలనీకి చెందిన ఓ వ్యక్తికి సోకిన కరోనా ఇంటిల్లిపాదికి అంటుకుంది. అ ఫ్యామిలీలో ఐదు రోజుల క్రితం ఓ మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారించారు వైద్యులు. దీంతో కుటుంబ సభ్యులు ఏడుగురికి అదే రోజు పరీక్షలు చేశారు. దీంతో మిగతా కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో వారందరిని చికిత్స నిమిత్తం ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు.
అటు పోడూరు మండలం జిన్నూరులోని సుబ్బారాయుడు కాలనీలో మరొకరికి కూడా కరోనావైరస్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆదివారం గ్రామంలో మొత్తం 8మందిని కరోనా పాజిటివ్గా గుర్తించారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. దీంతో ఒక్కసారి గ్రామంలో ఆందోళన నెలకొంది. వీరితో కాంటాక్ట్ అయినవారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు ఆరోగ్య సిబ్బంది. ఇప్పటివరకు జిన్నూరులో 38మంది, పోడూరులో ఐదుగురు కరోనా బారిన పడ్డట్లు పోడూరు పీహెచ్సీ సీహెచ్వో ఎ.దేవదాసు తెలిపారు