ఏపీ ఉద్యోగులకు పెరిగిన మధ్యంతర భృతి
ఏపీలో ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తమకు ఐఆర్ పెంచాలని ఉద్యోగ సంఘాలు కొత్త ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశాయి. వీరి కోరిక మేరకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఎప్పటినుంచో మధ్యంతర భృతిని పెంచాలని కోరుతుండగా.. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉద్యోగులు […]
ఏపీలో ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తమకు ఐఆర్ పెంచాలని ఉద్యోగ సంఘాలు కొత్త ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశాయి. వీరి కోరిక మేరకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఎప్పటినుంచో మధ్యంతర భృతిని పెంచాలని కోరుతుండగా.. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.