AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రైవేటు డీఎడ్‌ విద్యార్థులకు ఊరట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఊరట లభించింది. రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 20 వేల మంది 2018-20 బ్యాచ్‌ విద్యార్థులకు పరీక్ష రాసేందుకు వీలు కల్పించింది.

ఏపీ ప్రైవేటు డీఎడ్‌ విద్యార్థులకు ఊరట
Balaraju Goud
|

Updated on: Sep 20, 2020 | 12:41 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఊరట లభించింది. రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 20 వేల మంది 2018-20 బ్యాచ్‌ విద్యార్థులకు పరీక్ష రాసేందుకు వీలు కల్పించింది. రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన వారందరి అడ్మిషన్లను రాటిఫై చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రవైట్ కాలేజీల్లో చేరిన విద్యార్థులందరికీ పరీక్షలు రాసే అవకాశం కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈమేరకు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం.

డీసెట్‌లో క్వాలిఫై కాని వారితో అసలు కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా విద్యార్థులను చేర్చుకున్నారు. కన్వీనర్‌ కోటాలో భర్తీకాని సీట్లను, మేనేజ్‌మెంట్‌కోటా సీట్లను నేరుగా భర్తీ చేసుకున్న 188 డీఎడ్‌ కాలేజీలకు ఎన్‌సీటీఈ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది రాష్ట్ర సర్కార్. ఆపై తనిఖీల నేపథ్యంలో.. 2018-20 బ్యాచ్‌కి చెందిన విద్యార్థుల అడ్మిషన్లను రాటిఫై చేయలేదు. 2015లో పాఠశాల విద్యాశాఖ జీవో 30ని ఉల్లంఘించి 2018-20 సంవత్సరానికి కన్వీనర్‌ కోటాలో మిగిలిన సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకోవడంపై అధికారులు సీరియస్‌ అయ్యారు. కాగా, విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ఏపీ సీఎం జగన్ సర్కార్ వారు కూడా పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.