AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాలా బాధాకరం : ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

నిన్న జరిగిన దివ్య తేజస్విని హత్యపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం బాధాకరమని అన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చిన్నారులు, మహిళలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వింత పోకడలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని డీజీపీ పేర్కొన్నారు. ఈ ఘటనపై సీపీ స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా ఆదేశాలు జారీ చేసినట్టు […]

చాలా బాధాకరం : ఏపీ డీజీపీ గౌతం సవాంగ్
Venkata Narayana
|

Updated on: Oct 16, 2020 | 6:07 PM

Share

నిన్న జరిగిన దివ్య తేజస్విని హత్యపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం బాధాకరమని అన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చిన్నారులు, మహిళలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వింత పోకడలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని డీజీపీ పేర్కొన్నారు. ఈ ఘటనపై సీపీ స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేలా ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. ‘దిశ’ స్ఫూర్తిగా ఏడు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని తెలిపారు. క్రీస్తురాజపురానికి చెందిన దివ్యతేజస్విని అనే ఇంజనీరింగ్ చదువుతోన్న యువతిని నాగేంద్రబాబు అనే పెయింటింగ్ పని చేసే వ్యక్తి గురువారం కత్తితో నరికి చంపిన సంగతి తెలిసిందే.