AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం!

మూడు రాజధానుల అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు అంశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కీలక పాయింట్లు… *రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంపు *కలెక్టర్ల వ్యవస్థలో మార్పులు చేయడంపై చర్చించిన కేబినెట్ *జిల్లాల సంఖ్యను పెంచే అంశంపై చర్చ *4 జిల్లాలకు కలిపి […]

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం!
Ravi Kiran
|

Updated on: Jan 20, 2020 | 12:38 PM

Share

మూడు రాజధానుల అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు అంశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

కీలక పాయింట్లు…

*రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంపు

*కలెక్టర్ల వ్యవస్థలో మార్పులు చేయడంపై చర్చించిన కేబినెట్

*జిల్లాల సంఖ్యను పెంచే అంశంపై చర్చ

*4 జిల్లాలకు కలిపి ఒక సూపర్ కలెక్టర్‌ను నియమించే ఆలోచన

*విశాఖకు రాజ్‌భవన్, సచివాలయాన్ని, హెచ్‌వోడి ఆఫీసులు తరలించేందుకు ఆమోదం

* అమరావతిలో మూడు అసెంబ్లీ సెషన్స్ నిర్వహణ

*కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

*అమరావతి రైతులకు మెరుగైన ప్యాకేజీకి తీర్మానం

*రాజధానికి భూములిచ్చిన రైతులకిచ్చే కౌలు 10 నుంచి 15 ఏళ్లకు పెంపు

*సీఆర్డీఏ ఉపసంహరణ, అధికార వికేంద్రీకరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం

*పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఆమోదం

*విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేలేచర్ క్యాపిటల్

*11 వేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదముద్ర

*రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ స్థానంలో అమరావతి డెవలప్‌మెంట్ అధారిటీ ఏర్పాటుకు ఆమోదం

*రాజధాని ‌ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి లోకాయుక్తలో విచారణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది