ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం!
మూడు రాజధానుల అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు అంశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కీలక పాయింట్లు… *రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్ను రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంపు *కలెక్టర్ల వ్యవస్థలో మార్పులు చేయడంపై చర్చించిన కేబినెట్ *జిల్లాల సంఖ్యను పెంచే అంశంపై చర్చ *4 జిల్లాలకు కలిపి […]

మూడు రాజధానుల అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు అంశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
కీలక పాయింట్లు…
*రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్ను రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంపు
*కలెక్టర్ల వ్యవస్థలో మార్పులు చేయడంపై చర్చించిన కేబినెట్
*జిల్లాల సంఖ్యను పెంచే అంశంపై చర్చ
*4 జిల్లాలకు కలిపి ఒక సూపర్ కలెక్టర్ను నియమించే ఆలోచన
*విశాఖకు రాజ్భవన్, సచివాలయాన్ని, హెచ్వోడి ఆఫీసులు తరలించేందుకు ఆమోదం
* అమరావతిలో మూడు అసెంబ్లీ సెషన్స్ నిర్వహణ
*కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
*అమరావతి రైతులకు మెరుగైన ప్యాకేజీకి తీర్మానం
*రాజధానికి భూములిచ్చిన రైతులకిచ్చే కౌలు 10 నుంచి 15 ఏళ్లకు పెంపు
*సీఆర్డీఏ ఉపసంహరణ, అధికార వికేంద్రీకరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం
*పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆమోదం
*విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేలేచర్ క్యాపిటల్
*11 వేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదముద్ర
*రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ స్థానంలో అమరావతి డెవలప్మెంట్ అధారిటీ ఏర్పాటుకు ఆమోదం
*రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి లోకాయుక్తలో విచారణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది