AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2020 విజన్ అంటే ఇదేనా.. చంద్రబాబుపై రోజా ఫైర్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూడు రాజధానుల అంశాన్ని అడ్డుకునేందుకు ఛలో అమరావతికి చంద్రబాబు పిలుపునివ్వడంపై.. ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ముసుగులో డ్రామాలడుతున్నారని.. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో.. రాజధాని ప్రాంతంలో భూములు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమీలేదన్నారు. చంద్రబాబు విజన్ ఏంటో ఇప్పుడు తేటతెల్లమైందన్నారు. 2020 అంటే 20 ఎమ్మెల్యేలు 20 గ్రామాలు అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి […]

2020 విజన్ అంటే ఇదేనా.. చంద్రబాబుపై రోజా ఫైర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 20, 2020 | 10:53 AM

Share

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూడు రాజధానుల అంశాన్ని అడ్డుకునేందుకు ఛలో అమరావతికి చంద్రబాబు పిలుపునివ్వడంపై.. ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ముసుగులో డ్రామాలడుతున్నారని.. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో.. రాజధాని ప్రాంతంలో భూములు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమీలేదన్నారు. చంద్రబాబు విజన్ ఏంటో ఇప్పుడు తేటతెల్లమైందన్నారు. 2020 అంటే 20 ఎమ్మెల్యేలు 20 గ్రామాలు అంటూ ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి గతంలో లక్షా పదివేల కోట్ల రూపాయలు అవసరమన్న చంద్రబాబు.. ఇప్పుడు రెండు వేల కోట్లతో పూర్తవుతుందంటున్నారు.