AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గవర్నర్‌ను కలుసుకున్న సీఎం వైఎస్ జగన్… తాజా పరిస్థితులు, సంక్షేమ పథకాలపై చర్చ..!

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమావేశం అయ్యారు.

గవర్నర్‌ను కలుసుకున్న సీఎం వైఎస్ జగన్...  తాజా పరిస్థితులు, సంక్షేమ పథకాలపై చర్చ..!
Balaraju Goud
|

Updated on: Nov 13, 2020 | 3:38 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకున్న ఆయన.. అరగంటకు పైగా భేటీ అయ్యారు. హిందువులకు అత్యంత ప్రాశస్త్యమైన దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్‌.. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలను కూలంకషంగా గవర్నర్ కు వివరించారు ముఖ్యమంత్రి జగన్.