AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో క‌రోనా వీర‌విహారం..జిల్లాల వారీగా కేసుల వివ‌రాలు

ఏపీలో క‌రోనా తీవ్రత కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 9,747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం క‌రోనా సోకిన‌వారి సంఖ్య 1,76,333కు చేరింది.

ఏపీలో క‌రోనా వీర‌విహారం..జిల్లాల వారీగా కేసుల వివ‌రాలు
Ram Naramaneni
|

Updated on: Aug 04, 2020 | 8:36 PM

Share

AP Corona Cases Today : ఏపీలో క‌రోనా తీవ్రత కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 9,747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం క‌రోనా సోకిన‌వారి సంఖ్య 1, 76,333కు చేరింది. కొత్త‌గా క‌రోనాతో 67 మంది క‌రోనాతో చనిపోయారు. గ‌డిచిన 24 గంట్ల‌లో 95,625 మంది బాధితులు వ్యాధి బారి నుంచి కోలుకున్న‌ట్లు హెల్తె బులిటెన్ లో ప్ర‌భుత్వం తెలిపింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 79,104 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 64,147 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

జిల్లాల వారీగా కొత్త‌గా న‌మోదైన‌ కేసులు….తూర్పుగోదావరి -1371,  అనంతపురం -1325, కర్నూలు -1016,  గుంటూరు -940, విశాఖ -863,  కడప -765, పశ్చిమగోదావరి-612,  విజయనగరం-591,  నెల్లూరు-557,  శ్రీకాకుళం-537,  చిత్తూరు -526,  కృష్ణా-420,  ప్రకాశం -224

జిల్లాల వారీగా తాజా మృతుల వివరాలు…గుంటూరు -12, కృష్ణా- 9,  కర్నూలు -8,  చిత్తూరు-7, తూర్పుగోదావరి-7,  నెల్లూరు -7, అనంతపురం- 6, శ్రీకాకుళం -6, విశాఖ -2, ప్రకాశం-1, విజయనగరం-1, పశ్చిమగోదావరి-1

Read More : వారికి రూ.15వేలు సాయం : జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న జీవో రిలీజ్