AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెఎన్‌యు ఘటనపై.. దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు!

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ముసుగులు ధరించిన గూండాల హింసాత్మక దాడుల తరువాత, దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు తమ అసమ్మతి స్వరాలను వినిపించారు. వారు ఆకస్మిక నిరసన వ్యక్తం చేస్తూ.. వీటిని దారుణమైన అణిచివేత చర్యలుగా పేర్కొన్నారు. ముంబై వ్యాప్తంగా వందలాది విద్యాసంస్థలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఆదివారం అర్ధరాత్రి గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర సమావేశమయ్యారు. వారు దుండగులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక […]

జెఎన్‌యు ఘటనపై.. దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 06, 2020 | 11:03 AM

Share

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ముసుగులు ధరించిన గూండాల హింసాత్మక దాడుల తరువాత, దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు తమ అసమ్మతి స్వరాలను వినిపించారు. వారు ఆకస్మిక నిరసన వ్యక్తం చేస్తూ.. వీటిని దారుణమైన అణిచివేత చర్యలుగా పేర్కొన్నారు. ముంబై వ్యాప్తంగా వందలాది విద్యాసంస్థలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఆదివారం అర్ధరాత్రి గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర సమావేశమయ్యారు. వారు దుండగులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక ఆర్‌ఎస్‌ఎస్ కు చెందిన విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్‌ హస్తం ఉందని ఆరోపించారు.

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు.. జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపక సభ్యులకు సంఘీభావం తెలిపూతూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. హైదరాబాద్ లో కూడా విద్యార్థులు ప్రదర్శనలను నిర్వహించారు. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా అర్థరాత్రి నిరసనలు చేపట్టారు. జామియా టీచర్స్ అసోసియేషన్ (జెటిఎ) ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.

ముసుగు దుండగులు క్యాంపస్‌లో భీభత్సం సృష్టిస్తున్న సమయంలో.. క్యాంపస్‌లోని పోలీసు సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు మౌనంగా ఉండిపోయారని జెఎన్‌యు విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు ఆరోపించారు. నిందితులు పారిపోయేందుకు సహకరించారని వారు ఆరోపించారు. ఈ చర్యను ఖండిస్తూ వందలాది మంది ఢిల్లీలోని ఐటిఓ జంక్షన్ వద్ద ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం వెలుపల గుమిగూడారు.

ఆదివారం సాయంత్రం సాయుధ దుండగులు అనేక మంది విద్యార్థులు, అధ్యాపక సభ్యులపై దాడి చేశారు, వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ముసుగు దుండగులు క్యాంపస్‌లోని హాస్టళ్లలోకి చొరబడి విద్యార్థులపై దాడి చేశారు. గాయపడిన వారిలో సుమారు 12 మంది ఉపాధ్యాయులు, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఐషే ఘోష్ ఉన్నారు.

[svt-event date=”06/01/2020,3:34AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event date=”06/01/2020,3:35AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow Us
ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌
ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌
మీ గుండెలు పగిలినా పర్వాలేదు..టీమిండియాకు శాంట్నర్ వార్నింగ్
మీ గుండెలు పగిలినా పర్వాలేదు..టీమిండియాకు శాంట్నర్ వార్నింగ్
పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి..
పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి..
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
డిస్కౌంట్‌ ధరకు బంగారం.. ఊహించని ఆఫర్..!
డిస్కౌంట్‌ ధరకు బంగారం.. ఊహించని ఆఫర్..!
తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇద
తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇద
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
భారత్‌ను ఓడించడం అసాధ్యం.. సౌతాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు
భారత్‌ను ఓడించడం అసాధ్యం.. సౌతాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు