AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలుషిత ఆహారంతో 22మందికి అస్వస్థత.. ముగ్గురి చిన్నారుల పరిస్థితి విషమం..!

ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సాంప్రదాయ పూజ ప్రాణాల మీదికి తెచ్చింది. ఫుడ్ పాయిజన్ తో 22 మంది ఆస్పత్రిపాలు కాగా.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌నాయక్‌ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఓ కుటుంబంలో స్థానిక సంప్రదాయ పూజ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి సమర్పించిన నైవేద్యాన్ని బుధవారం ఉదయం ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కల వారు ప్రసాదంగా స్వీకరించారు. కొద్ది గంటల వ్యవధిలోనే […]

కలుషిత ఆహారంతో 22మందికి అస్వస్థత.. ముగ్గురి చిన్నారుల పరిస్థితి విషమం..!
Balaraju Goud
|

Updated on: May 27, 2020 | 5:39 PM

Share

ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సాంప్రదాయ పూజ ప్రాణాల మీదికి తెచ్చింది. ఫుడ్ పాయిజన్ తో 22 మంది ఆస్పత్రిపాలు కాగా.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌నాయక్‌ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఓ కుటుంబంలో స్థానిక సంప్రదాయ పూజ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి సమర్పించిన నైవేద్యాన్ని బుధవారం ఉదయం ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కల వారు ప్రసాదంగా స్వీకరించారు. కొద్ది గంటల వ్యవధిలోనే ప్రసాదం తిన్న దాదాపు 22 మందికి వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ఉట్నూరు‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఏడుగురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నారు. వారిలో చిన్నారులు రిషిత(3), నైనక్‌(2), సూరజ్‌(3)ల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఉట్నూరు రెవిన్యూ అధికారులు ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం వైద్యులతో చర్చించారు.