AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉడయ్‌పూర్‌లో ఇండో-అమెరికన్ ఫ్యామిలీ రాయల్ వెడ్డింగ్.. ట్రంప్ కుమారుడి సహా 40 దేశాల అతిథులు హాజరు

రాజస్థాన్‌ ఉడయ్‌పూర్ వేదికగా ఇండో–అమెరికన్ కుటుంబం రాయల్ వెడ్డింగ్ జరుగుతోంది. ఈ వివాహనికి ట్రంప్ కుమారుడితో సహా 40 దేశాల VIPల రాకతో ఈ పెళ్లి హాట్ టాపిక్ అయ్యింది. అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన బిలియనీర్ రామరాజు మంతెన వధువు తండ్రి ఆయన కూతురు నేత్ర మంతెనకు అమెరికాకే చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ CEO వంశీ గాదిరాజుకు ఇచ్చి రాజస్థాన్‌లోని ఉదయపూర్ లీలా ప్యాలస్‌లో వివాహం జరిపిస్తున్నారు.

ఉడయ్‌పూర్‌లో ఇండో-అమెరికన్ ఫ్యామిలీ రాయల్ వెడ్డింగ్..  ట్రంప్ కుమారుడి సహా 40 దేశాల అతిథులు హాజరు
Udaipur Star Studded Wedding
Balaraju Goud
|

Updated on: Nov 22, 2025 | 8:29 AM

Share

రాజస్థాన్‌ ఉడయ్‌పూర్ వేదికగా ఇండో–అమెరికన్ కుటుంబం రాయల్ వెడ్డింగ్ జరుగుతోంది. ఈ వివాహనికి ట్రంప్ కుమారుడితో సహా 40 దేశాల VIPల రాకతో ఈ పెళ్లి హాట్ టాపిక్ అయ్యింది. అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన బిలియనీర్ రామరాజు మంతెన వధువు తండ్రి ఆయన కూతురు నేత్ర మంతెనకు అమెరికాకే చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ CEO వంశీ గాదిరాజుకు ఇచ్చి రాజస్థాన్‌లోని ఉదయపూర్ లీలా ప్యాలస్‌లో వివాహం జరిపిస్తున్నారు. శనివారం (నవంబర్ 22) జరుగుతున్న పెళ్లికి అమెరికా ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, భారీ నెట్‌వర్క్ ఉన్న VIPలు విచ్చేశారు.

ఇక పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ తోపాటు బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, షాహిద్ కపూర్ లతో సహా దాదాపు సెలెబ్రిటీలందరూ హాజరయ్యారు. అంబానీ కొడుకు వివాహం తర్వాత భారత్‌లో జరుగుతున్న అత్యంత ఖరీదైన పెళ్లి ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఉదయ్‌పూర్ విద్యుత్ దీపాల వెలుగుతో ధగధగా మెరుస్తుంది. ప్యాలస్‌తో పాటు సిటీని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

అయితే భారత్‌ పర్యటనలో భాగంగా ట్రంప్‌ జూనియర్, అతని స్నేహితురాలు…అనంత్‌ అంబానీ, కోడలు రాధికా మర్చంట్‌లతో కలిసి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో సంప్రదాయ దాండియా ఆడారు. వన్‌తారాను కూడా సందర్శించారు. అంతకుముందు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us