AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేషన్‌కార్డు దారులకు బిగ్‌షాక్‌.. డిసెంబర్‌ 31లోపు ఇది చేయకపోతే రేషన్‌ బంద్‌!

రేషన్‌ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేషన్‌కార్డు దారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తి కాని యూనిట్లకు ఈకేవైసీ పూర్తి చేయకుంటే రేషన్‌ కోటా నిలిపివేస్తామని ఇప్పటికే అధికారులు పలుమార్లు హెచ్చరించినా జనాలు నిర్లక్ష్యం వీడటం..

రేషన్‌కార్డు దారులకు బిగ్‌షాక్‌.. డిసెంబర్‌ 31లోపు ఇది చేయకపోతే రేషన్‌ బంద్‌!
Ration Card E-KYC last date
Srilakshmi C
|

Updated on: Dec 14, 2025 | 12:03 PM

Share

హైదరాబాద్, డిసెంబర్‌ 14: రేషన్‌ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేషన్‌కార్డు దారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తి కాని యూనిట్లకు ఈకేవైసీ పూర్తి చేయకుంటే రేషన్‌ కోటా నిలిపివేస్తామని ఇప్పటికే అధికారులు పలుమార్లు హెచ్చరించినా జనాలు నిర్లక్ష్యం వీడటం లేదు. రేషన్‌ కార్డుల్లో పేర్లు ఉన్న సభ్యులందరూ సమీపంలోని రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్‌ యంత్రంలో బయోమెట్రిక్‌ వేలిముద్రలు వేసి ఆప్‌డేట్‌ చేయించుకోవాలి. రేషన్‌ కార్డు సభ్యులు ఈ-కేవైసీ చేసుకుంటేనే రేషన్‌ అందిస్తామని, లేదంటే వారందరికీ రేషన్‌ ఆపివేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో రేషన్‌ కార్డుల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

రెండేండ్లుగా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నా వినియోగదారులు పూర్తి స్థాయిలో అప్‌డేట్ చేసుకోవడం లేదు. ఈ క్రమంలో డిసెంబర్‌ 31వ తేదీలోపు మిగిలిన వారంతా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రకటన వెలువరించారు. ఈలోపు ఈకేవైసీ చేయించుకోని వారందరికీ రేషన్‌ కోటా ఉండదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ పరిణామం ఎలా ఉంటుందోనన్న ఆందోళన అటు రేషన్‌ డీలర్లు, ఇటు జనాలకు మొదలైంది. దీంతో డిసెంబర్‌ 31 వరకు ముగింపు గడువు కాకుండా మరింత పెంచాలని రేషన్‌ కార్డుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ-పాస్‌ యంత్రంలో బయోమెట్రిక్‌ వేలిముద్రలు కొందరివి నమోదు కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ-పాస్‌ యంత్రంలో నమోదు కాకుంటే తమ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ఇటీవల మంజూరు చేసిన రేషన్‌కార్డుదారులకు ఇంకా సంక్షేమ పథకాలను మంజూరు చేయడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పాత రేషన్‌ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యంతో పాటు వంటగ్యాస్‌, గృహజ్యోతి, ఉచిత కరెంట్‌ అందిస్తున్నారు. అయితే కొత్త కార్డులు పొందిన వారికి మాత్రం ఈ పథకాలు అందడం లేదు. కొత్త రేషన్‌ కార్డుదారులకు కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందించేలా చూడాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..