AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట పండ్లు తినడం మంచిదేనా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

ప్రస్తుతం చాలా మంది రాత్రిపూట పండ్లు తినడాన్ని అలవాటుగా చేసుకుంటున్నారు. అయితే రాత్రి సమయంలో కొన్ని ప్రత్యేకమైన పండ్లు తినడం ఆరోగ్యానికి హానికరమవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి రాత్రిపూట పండ్లు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రాత్రిపూట పండ్లు తినడం మంచిదేనా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Side Effects Of Eating Fruits At Night
Prashanthi V
|

Updated on: Feb 20, 2025 | 8:13 PM

Share

మనం తినే కొన్ని పండ్లలో అధిక చక్కెర ఉండటంతో రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగి నిద్ర సమస్యలు రావచ్చంటున్నారు నిపుణులు. అలాగే అధిక ఫైబర్ కలిగిన పండ్లు జీర్ణ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కొన్ని పండ్లలో పోటాషియం అధికంగా ఉండటంతో కండరాల తిమ్మిరి సమస్య ఏర్పడుతుంది. అధిక ఆమ్లత కలిగిన పండ్లు యాసిడిటీ పెంచి అజీర్ణాన్ని కలిగించవచ్చు. కాబట్టి రాత్రిపూట కొన్ని పండ్లు మితంగా తీసుకోవడం మంచిది.

నిద్ర సమస్యలు

కొన్ని పండ్లలో సహజమైన చక్కెర అధికంగా ఉంటుంది. రాత్రిపూట అలాంటి పండ్లు తినడం వల్ల శరీరంలోని ఎనర్జీ లెవల్స్ పెరిగి నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఫలితంగా నిద్రలో అంతరాయం ఏర్పడి రాత్రంతా అనుకున్న విధంగా విశ్రాంతి పొందలేకపోవచ్చు.

జీర్ణ సమస్యలు

పండ్లలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కొన్ని పండ్లలో మలబద్ధకాన్ని తొలగించే గుణం ఉంటుందని, ఇవి కొందరికి విరేచనాలకు దారితీసే అవకాశం ఉంటుంది. దీంతో రాత్రి సమయంలో కడుపు అసౌకర్యంగా మారుతుంది.

కండరాల తిమ్మిరి

అరటిపండు, సిట్రస్ ఫలాలు వంటి పండ్లలో అధికంగా పోటాషియం ఉంటుంది. రాత్రిపూట ఎక్కువగా పోటాషియం తీసుకుంటే కండరాలు గట్టిపడి, తిమ్మిరి సమస్యకు దారితీస్తుంది. ఇది నిద్రలో అంతరాయం కలిగించవచ్చు.

బరువు పెరగడం

శరీరానికి అవసరమైన కేలరీలను ఉపయోగించుకునేందుకు నిద్రించే సమయంలో అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా రాత్రిపూట ఎక్కువ పండ్లు తినడం శరీర బరువును పెంచే ప్రమాదాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చక్కెర ఎక్కువగా ఉండే పండ్లు బరువు పెరిగేందుకు కారణమవుతాయి.

యాసిడిటీ

కొంతమంది వారికి రాత్రిపూట నారింజ, టమోటా వంటి ఆమ్ల పండ్లను తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు. ఇది గ్యాస్ట్రిక్ ఇబ్బందులను పెంచి ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లక్షణాలను తీవ్రమయ్యేలా చేయొచ్చు.

తినకూడని పండ్లు

  • అధిక చక్కెర కలిగిన పండ్లు (మామిడి, అంజీర్)
  • అధిక ఫైబర్ కలిగిన పండ్లు (సీతాఫలం, పైనాపిల్)
  • ఆమ్లత్వం ఎక్కువగా ఉన్న పండ్లు (నారింజ, ద్రాక్ష)

రోజులో ఏ సమయాన్నైనా పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. అయితే రాత్రిపూట కొన్ని ప్రత్యేకమైన పండ్లను మితంగా తినకపోతే అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే రాత్రిపూట తగిన జాగ్రత్తలు పాటిస్తూ సరైన సమయానికి తినడం ఆరోగ్యానికి మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)