AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lungs Health: పొగ తాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్.. శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ విషయాలు..

నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీలో ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించి ఓ నూతన పరిశోధన వెలుగులోకి వచ్చింది. కిల్లింగ్స్ క్యాన్సర్ రోగుల్లో 50 శాతం మంది పొగతాగే అలవాటు లేని వారని..

Lungs Health: పొగ తాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్.. శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
Lungs
Ganesh Mudavath
|

Updated on: Nov 24, 2022 | 7:19 AM

Share

నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీలో ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించి ఓ నూతన పరిశోధన వెలుగులోకి వచ్చింది. కిల్లింగ్స్ క్యాన్సర్ రోగుల్లో 50 శాతం మంది పొగతాగే అలవాటు లేని వారని, అందులో 70 శాతం మంది 50 ఏళ్ల లోపు వారేనని తేలింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులందరూ 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు నుంచి ధూమపానం చేయనివారేనని గుర్తించారు. మహిళలు కూడా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్క్వామస్ కార్సినోమా కంటే చాలా ప్రాణాంతకమైన క్యాన్సర్ రకం అడెనోకార్సినోమా కేసులు కూడా యువతలో కనిపిస్తున్నాయని చెప్పారు. మెండాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ ఓంకో-సర్జరీ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఛైర్మన్ డాక్టర్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని బృందం.. మార్చి 2012 నుంచి నవంబర్ 2022 మధ్య చికిత్స పొందిన వారి వివరాలను ట్రాక్ చేసింది. ఈ సందర్భంగా ఔట్‌ పేషెంట్‌ దవాఖానకు వచ్చే రోగులను పరిశీలించారు. ఇందులో ఊపిరితిత్తులకు సంబంధించిన వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో 30 ఏళ్ల లోపు వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 304 మంది రోగులపై చేసిన పరిశోధనలో పెద్ద సంఖ్యలో పొగ తాగని వారు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారని తేలింది.

60 ఏళ్లు పై బడిన వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా నమోదయ్యే పాశ్చాత్య దేశాలలో కాకుండా భారతదేశంలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులలో 10 శాతం మంది 40 ఏళ్లలోపు వారే. ఊపిరితిత్తుల క్యాన్సర్ ధూమపానం చేసేవారిలో, ధూమపానం చేయనివారిలో దాదాపు ఒకే విధంగా ఉంటుందని కనుగొన్నారు. యువతే ఎక్కువగా ఈ ప్రమాదానికి గురవుతున్నారని వివరించారు. బయటి నుంచి ఊపిరితిత్తులను కప్పి ఉంచే కణాలు క్యాన్సర్‌గా మారినప్పుడు అడెనోకార్సినోమా ఏర్పడుతుంది.

కార్సినోమా.. వాయుమార్గాల కణాలను ప్రభావితం చేస్తుంది. స్టేజ్ 3, స్టేజ్ 4 లో క్యాన్సర్ నిర్ధారణ అవుతుందనే ఆందోళన కూడా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగుల చికిత్స సవాల్‌గా మారుతుంది. కానీ ప్రస్తుత పరిశోధన ప్రకారం.. ఈ దశలలో యువ రోగులు శారీరకంగా వారి కార్యకలాపాలలో 85 శాతం చేయగలరు. కచ్చితమైన వ్యాధిని గుర్తించలేని అనేక సందర్భాలు ఉన్నాయి. టీబీకి చికిత్స పొందుతున్న రోగులలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రమాదం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం