Gold Rate Today : రెండో రోజూ స్వల్పంగా పెరిగిన పసిడి ధర, వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి
బంగారం ధరపై వివిధ అంశాలు ప్రభావం చూపిస్తాయి. అందుకే రేటు విషయంలో నిత్యం హెచ్చుతగ్గులు ఉంటాయి. ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలు...

బంగారం ధరపై వివిధ అంశాలు ప్రభావం చూపిస్తాయి. అందుకే రేటు విషయంలో నిత్యం హెచ్చుతగ్గులు ఉంటాయి. ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధాలు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి పలు అంశాలు బంగారం ధరని ఎఫెక్ట్ చేస్తాయి. బంగారం కొనేవారు ఎప్పుడు రేటు తగ్గుతుందా అని నిత్యం ధరలను గమనిస్తూ ఉంటారు. భారతీయులకు బంగారం అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వరసగా రెండో రోజు కూడా దేశంలో పసిడి ధర పెరిగింది. బుధవారం పది గ్రాముల బంగారం ధర 50 పెరగ్గా.. నేడు మరో రూ.110 పెరిగింది. దేశంలో 22 క్యారెట్ల బంగారం (పది గ్రాములు) ధర రూ. 48,300కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,300కు చేరింది.
హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 46,200కి పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,400కు చేరింది. విశాఖపట్నం, విజయవాడలలోనూ ధరలు ఇలాగే ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) 48,310, న్యూఢిల్లీలో 48,350, చెన్నైలో 46,880, కోల్కతాలో 48,550, బెంగళూరులో 46,200 చొప్పున బంగారం ధరలు ఉన్నాయి.
Also Read :
ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆయుర్వేదం డబ్బాల్లో కొత్త రకం చాక్లెట్లు, అవి తిన్నారో ఇక అంతే !
హెచ్సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే