AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kedarnath Dham: ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ ఆలయం..8 క్వింటాళ్ల పూలతో అలంకరణ.. వీడియో చూస్తే

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌ ధామ్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఇక బద్రీనాథ్‌ ఆలయాన్ని మే 4 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. చార్‌ధామ్‌ యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరిచే సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని భావిస్తున్నారు. చార్ ధామ్ యాత్ర

Kedarnath Dham: ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ ఆలయం..8 క్వింటాళ్ల పూలతో అలంకరణ.. వీడియో చూస్తే
Kedarnath Dham
Jyothi Gadda
|

Updated on: Apr 28, 2025 | 1:20 PM

Share

అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 30 నుండి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ చార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతోంది. దీని కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అదే సమయంలో కేదార్‌నాథ్ ఆలయంలో కూడా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా జ్యోతిర్లింగ క్షేత్రమైన‌ కేదార్‌నాథ్ ఆల‌యాన్ని మే 2న తెరవనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మే 2న తెరుచుకుంటాయి. దీనికి ముందు, ఆలయాన్ని 8క్వింటాళ్ల పూలతో  అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎం పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియాలో విడుదల చేశారు.

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌ ధామ్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఇక బద్రీనాథ్‌ ఆలయాన్ని మే 4 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. చార్‌ధామ్‌ యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరిచే సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని భావిస్తున్నారు. చార్ ధామ్ యాత్ర పట్ల భక్తులలో కూడా ఉత్సాహం ఉంది. ఈ రకమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని సన్నాహాలను బలోపేతం చేయడంలో బిజీగా ఉంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

చార్ ధామ్‌కు వచ్చే భక్తులను స్వాగతించడానికి ఉత్తరాఖండ్ సిద్ధంగా ఉందని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. దీని గురించి రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొందని చెప్పారు.. ప్రయాణానికి ముందే ప్రతి స్థాయిలో అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లను సందర్శిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..