AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న అక్కినేని ఫ్యామిలీ.. కథను సిద్ధం చేసే పనిలో విక్రమ్ కుమార్…

మనం సినిమాతో అక్కినేని కుటుంబానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు దర్శకుడు విక్రమ్ కుమార్. అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల హీరోలను కలిపి ఈ సినిమాలో చూపించాడు.

మరోసారి భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న అక్కినేని ఫ్యామిలీ.. కథను సిద్ధం చేసే పనిలో విక్రమ్ కుమార్...
Rajeev Rayala
|

Updated on: Jan 27, 2021 | 1:09 PM

Share

Vikram Kumar : ‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు దర్శకుడు విక్రమ్ కుమార్. అక్కినేని ఫ్యామిలీ మూడు తరాల హీరోలను కలిపి ఈ సినిమాలో చూపించాడు. పూర్వజన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి చిత్రం ఇదే అయ్యింది. ఈ సినిమా తర్వాత అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో ‘హలో’ అనే సినిమా చేసాడు విక్రమ్ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. చివరగా నాని హీరోగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విక్రమ్ ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

తాజాగా మరోసారి భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నాడట విక్రమ్ . ఈ మేరకు ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. నాగార్జున – నాగ చైతన్య – అఖిల్ – సమంత – అమల – సుమంత్ – సుశాంత్ ఇలా అక్కినేని ఫ్యామిలీ నటీనటులందరితో ఓ భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట విక్రమ్. అక్కినేని హీరోలందరితో ఓ ఫ్యామిలీ సినిమా తీయాలని నాగార్జున విక్రమ్ ను కోరాడట. అయితే అందుకు తగ్గ కథను దర్శకుడు దశరద్ సిద్ధం చేసాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమానుపట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. మరో వైపు విక్రమ్ చైతన్యతో ‘థాంక్యూ’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

మరిన్ని ఇక్కడ చదవండి :

Krithi Shetty : కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిన ముద్దుగుమ్మ.. కృతిశెట్టి కోసం క్యూ కడుతున్న ఆఫర్లు