మూడో భర్తను ఇంటి నుంచి గెంటేసిన నటి..!

లాక్‌డౌన్ వేళ వివాదాస్పదంగా మారిన విషయాల్లో నటి వనితా విజయ్ కుమార్‌ వివాహం ఒకటి. సినీ ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్‌ని వనితా జూన్‌లో పెళ్లి చేసుకుంది.

మూడో భర్తను ఇంటి నుంచి గెంటేసిన నటి..!
Follow us

| Edited By:

Updated on: Oct 19, 2020 | 3:36 PM

Vanitha Vijayakumar News: లాక్‌డౌన్ వేళ వివాదాస్పదంగా మారిన విషయాల్లో నటి వనితా విజయ్ కుమార్‌ వివాహం ఒకటి. సినీ ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్‌ని వనితా జూన్‌లో పెళ్లి చేసుకుంది. పీటర్ తనను బాగా అర్థం చేసుకున్నాడని, అందుకే ఆయనతో జీవితం పంచుకోవాలనుకుంటున్నానని అప్పట్లో వనితా ఓ పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే వీరి పెళ్లి మరుసటి రోజు పీటర్ మొదటి భార్య అతడిపై కేసు పెట్టింది. తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్, వనితాను పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపణలు చేశారు. దీంతో వివాదం మొదలైంది. పలువురు సినీ ప్రముఖులు వనితాపై విమర్శలు కురిపించారు. వాటన్నింటికి వనితా గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని న్యాయపరంగా చూసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

ఇక ఇటీవల వనితా, పీటర్‌లు పిల్లలను తీసుకొని గోవా ట్రిప్‌కి వెళ్లి వచ్చారు. అక్కడ వీరిద్దరు తీసుకున్న కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌ అయ్యాయి. అయితే కోలీవుడ్‌లో తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. గోవా ట్రిప్‌లో అధిక మద్యాన్ని సేవించిన పీటర్‌.. వనితాతో అసభ్యంగా ప్రవర్తించారట. దీంతో ఆమె, అతడిని కొట్టిందట. ఇక చెన్నైకి వచ్చిన తరువాత కూడా పీటర్‌ మద్యం మత్తులో ఉండటంతో అతడిని ఇంటి నుంచి గెంటేసిందట. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇల్లీగల్‌ మ్యారేజ్‌కి వ్యతిరేకంగా చాలా మంది కోరుకున్న కోరిక నెరవేరింది. పీపీ(పీటర్ పాల్‌)ని తన్ని తరిమేశారు అని కామెంట్ పెట్టారు. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే వనితా స్పందించాల్సిందే.

Read More:

నిత్య, రీతూల ‘నిన్నిలా నిన్నిలా’.. ఆకట్టుకుంటోన్న పోస్టర్‌

జవాన్ మృతదేహం పంపేందుకు ‘నో’ చెప్పిన అధికారులు