జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. పోలీసుల సంచలన ప్రకటన!
కాకినాడ జిల్లాలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం కేసు రోజురోజుకు మిస్టరీగా మారుతోంది. 25 రోజులు దాటినా పాప ఆచూకీ లభించకపోవడంతో కుటుంబంతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దర్యాప్తు కోసం 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు, ప్రజల సహకారాన్ని కోరుతూ గోడపత్రికలు అతికించారు. జాహ్నవి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల పారితోషికాన్ని ప్రకటించారు.
కాకినాడ జిల్లా, తుని మండలం, సీహెచ్. అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై దాదాపు నెల రోజులు కావస్తున్నా ఆమె ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జూన్ ఆరవ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటున్న జాహ్నవి మధ్యాహ్నం 11:50 నిమిషాల సమయంలో కనిపించకుండా పోయింది. ఈ కేసు రోజురోజుకు మరింత మిస్టరీగా మారుతోంది.చిన్నారి అదృశ్యంపై తుని రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. డ్రోన్ల సాయంతో అటవీ ప్రాంతాల్లో సైతం తనిఖీలు నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలను పరిశీలించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కీలక సమాచారం లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
అంచనాలు పెంచేస్తున్న సెకండాఫ్ మూవీస్.. ఫస్టాఫ్ గాయాలను మరిపిస్తుందా..?
ఆలియా సినిమాపై ప్రభాస్ ట్వీట్.. ఆన్లైన్లో నయా డిస్కషన్
జస్ట్ 80 డేస్… క్రేజీ న్యూస్ రివీల్ చేసిన జక్కన్న
టాక్సిక్ టీజర్… మరింత బోల్డ్గా లేడీస్ గ్యాంగ్
నిరాశపరిచిన ఫస్టాఫ్… సెకండాఫ్ సంగతేంటి?
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

