టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ గుడ్ న్యూస్ చెప్పింది. ‘బాపు బొమ్మ’ గా తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ రెండో సారి అమ్మ గా ప్రమోషన్ పొందనుంది. ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తన బేబీ బంప్ ఫొటోలు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ప్రణీత.. ‘రౌండ్ 2… ఇక నుంచి ప్యాంట్లు సరిపోవు’ అంటూ చమత్కారంగా తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ప్రణీతకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రణీత సుభాష్ 2021 మే 30వ తేదీన వివాహం చేసుకుంది.. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. కోవిడ్ కారణంగా అప్పట్లో ఈ పెళ్లి చాలా సింపుల్గా జరిగింది. ప్రణీత- నితిన్ రాజు దంపతులకు2022లో మొదటి బిడ్డ జన్మనిచ్చింది. ఆ ఆ పాపకు అర్నా అని పేరు పెట్టారు. ఇప్పుడు ప్రణీత మరో బిడ్డకు జన్మనివ్వనుంది.
సిద్ధార్థ్ నటించిన బావ సినిమాతో తెలుగు ఇండస్డ్రీకి పరిచయమైంది ప్రణీత. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో ఇక్కడి వారికి బాగా చేరువైంది. ఆ తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు సినిమాల్లోనూ నటించింది. అయితే ఎక్కువగా సెకెండ్ హీరోయిన్ గానే కనిపించిన ప్రణీత మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా రాణించలేకపోయింది. తెలుగులో ఆమె చివరిగా బాలకృష్ణ కథానాయకుడు సినిమాలో నటించింది. అయితే ఆ తర్వాత కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది.
ప్రణీత నటించిన రామ్ అవతార్ సినిమా ఈ ఏడాదే విడుదలైంది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదీ అందాల తార. ప్రస్తుతం బెంగళూరులోనే తన ఫ్యామిలీతో కలిసి నివాసముంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.