AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Tarun: రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ కొట్టేనా..? తిరగబడరా సామీ అంటున్న కుర్రహీరో

అన్నపూర్ణ బ్యానర్ లో ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సినిమా చూపిస్తా మామ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత ఆడోరకం ఈడోరకం అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోయారు.

Raj Tarun: రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ కొట్టేనా..? తిరగబడరా సామీ అంటున్న కుర్రహీరో
Raj Tarun
Rajeev Rayala
|

Updated on: Aug 30, 2023 | 8:25 AM

Share

టాలీవుడ్ లో తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో రాజ్ తరుణ్ ఒకరు. షార్ట్ ఫిలింస్ నుంచి హీరోగా మారాడు రాజ్ తరుణ్. అన్నపూర్ణ బ్యానర్ లో ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సినిమా చూపిస్తా మామ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత ఆడోరకం ఈడోరకం అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోయారు.

ఇక ఇప్పుడు కొంతకాలం బ్రేక్ తీసుకొని ఇప్పుడు ఓ సినిమాతో రాబోతున్నాడు. తిరగబడరా స్వామి అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు రాజ్ తరుణ్. తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

View this post on Instagram

A post shared by Raj Tarun (@rajtarunn)

గతంలో రవి కుమార్ బాలకృష్ణతో కలిసి వీరభద్ర,  సాయి ధరంతేజ్ హీరోగా నటించిన పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాలు చేశారు. వీటిలో వీరభద్ర మూవీ డిజాస్టర్ గా నిలిచింది. పిల్ల నువ్వు లేని జీవితం సినిమా పర్లేదు అనిపించుకుంది.

View this post on Instagram

A post shared by Raj Tarun (@rajtarunn)

ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో ఎక్కైవగా భయపడే వ్యక్తిగా రాజ్ తరుణ్ కనిపించాడు. రాజ్ తరుణ్ సరసన మల్వి మల్హోత్రా హీరోయిన్ గా నటిస్తుంది.

బాలయ్య సినిమా టికెట్ కోసం హత్య చేసిన పరవాలేదు అనే డైలాగ్ ఆకట్టుకుంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ఈ మూవీ. ఈ సినిమాతో హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు రాజ్ తరుణ్ ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..