AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ రోజుల్లో బి. ఏ డిగ్రీ చదివిన హీరోయిన్ ఆమె ఒక్కరే.. అందంలో దేవకన్య.. నటనకు ప్రేక్షకులే ఫిదా..

సీనియర్ నటి తెలుగు సినిమాకు చేసిన సేవ అపారం. బి.ఎ. చదివిన తొలి హీరోయిన్‌గా పేరు పొందిన ఆమె, నటనలో ఓనమాలు దిద్ది, ఆ తర్వాత నిర్మాతగా కూడా విజయవంతమయ్యారు. ఆమె జీవితం, విద్య, నటనా ప్రస్థానం, నిర్మాణిగా ఆమె పోషించిన పాత్ర, వ్యక్తిగత జీవిత విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

Tollywood : ఆ రోజుల్లో బి. ఏ డిగ్రీ చదివిన హీరోయిన్ ఆమె ఒక్కరే.. అందంలో దేవకన్య.. నటనకు ప్రేక్షకులే ఫిదా..
Vasanti
Rajitha Chanti
|

Updated on: Jul 21, 2026 | 9:35 AM

Share

సీనియర్ నటి, నిర్మాత వాసంతి వెండితెర ప్రస్థానం తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం. కొందరు పాత తరం హీరోయిన్లు మాత్రమే నిర్మాతలుగా మారిన జాబితాలో వాసంతి ఒకరు. ఆమె అసలు పేరు లక్ష్మీరాజ్యం. ఒంగోలు సమీపంలోని తిమ్మసముద్రం గ్రామంలో కరణం అచ్చయ్య చౌదరి కుమార్తెగా జన్మించారు. గుంటూరులోని ఏసీ కాలేజీలో ఇంటర్ వరకు చదివిన వాసంతి, మద్రాసులోని ఎతిరాజా కాలేజీలో బి.ఎ. పూర్తి చేశారు. ఆ రోజుల్లో డిగ్రీ చదివిన హీరోయిన్‌లలో ఈమె ఒకరు. అందుకే సినిమా టైటిల్స్‌లో తన పేరు పక్కన “బి.ఎ.” అని వేయమని ఆమె నిర్మాతలకు చెప్పేవారు. కాలేజీ వార్షికోత్సవానికి అక్కినేని నాగేశ్వరరావును ఆహ్వానించడానికి వెళ్ళిన సందర్భంలో, వాసంతి చలాకీతనం చూసి ఏఎన్నార్ ఆమెను సినిమాల్లోకి ఆహ్వానించారు. అలా “మహాకవి కాళిదాసు” చిత్రంలో కాళికాదేవి వేషంతో ఆమె తెరంగేట్రం చేశారు. అప్పటికి నటనపై ఆమెకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. బి.ఎ. పూర్తయ్యాక న్యాయశాస్త్రం చదువుదామని లా కాలేజీలో చేరారు. అయితే, ఆమెను కళామతల్లి వదలలేదు. ప్రముఖ తమిళ దర్శకుడు శ్రీధర్ ఆమెను చూసి, తన హీరోయిన్‌గా ఎంపిక చేయాలని నిశ్చయించుకున్నారు. తండ్రి అచ్చయ్య చౌదరి ప్రోత్సాహంతో, లా చదువుతూనే నటిస్తానని కండిషన్‌తో “తేన్నిలవు” (తెలుగులో “విరిసిన వెన్నెల”) చిత్రంలో నటించారు. ఈ సినిమా అవుట్‌డోర్ షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లాల్సి రావడంతో, చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టి నటనపై దృష్టి సారించారు.

ఆ తర్వాత “మంచి మనసులు”, “పునర్జన్మ”, “ఆత్మగౌరవం”, “పల్నాటి యుద్ధం”, “ఉయ్యాల జంపాల”, “మంగళసూత్రం”, “అనురాగం” వంటి తెలుగు చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు సరసన నటించారు. తమిళంతో పాటు మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ ఆమె నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. తెలుగులో ఆమె పోషించిన పాత్రలు ఒకే మూసలో (ప్రేమను త్యాగం చేయడం, ఆత్మహత్య చేసుకోవడం వంటివి) ఉండటంతో, గ్లామర్ పాత్రల ట్రెండ్ మారిన తర్వాత అవకాశాలు తగ్గాయి. తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకోలేకపోయానని బాధపడిన వాసంతి, నిర్మాతగా మారి డబ్బింగ్ చిత్రాల నిర్మాణం ప్రారంభించారు. ఎం.జి.ఆర్., సరోజాదేవి నటించిన “పనక్కార కుటుంబం” చిత్రాన్ని “శ్రీమంతులు” పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. 1964లో డబ్బింగ్ చిత్రాలపై నిషేధం ఉద్యమం వచ్చినా, అష్టకష్టాలు పడి సినిమాను విడుదల చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన పలు తెలుగు చిత్రాలను తమిళంలోకి డబ్ చేసి, నిర్మాతగా నిలదొక్కుకున్నారు.

తెలుగులో సొంత చిత్రాలు తీయాలని సంకల్పించి, “కన్నెపాప” అనే తమిళ చిత్రాన్ని “భలే పాప” పేరుతో రీమేక్ చేశారు. డబ్బింగ్ చిత్రాల ద్వారా వచ్చిన రెండు లక్షల రూపాయలతో ఈ సినిమాను నిర్మించారు. ఆమె భర్త శ్రీనివాసన్, తమిళనాడు శాసనసభ ఉపసభాపతిగా పనిచేశారు. రాజకీయాల్లో ప్రముఖుడైన శ్రీనివాసన్, వాసంతిని చిత్ర నిర్మాణం పట్ల ప్రోత్సహించారు. కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో తయారైన “భలే పాప” (1971) ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత పదిహేనేళ్లపాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉండి, కుమార్తెను పెంచి పెద్ద చేశారు. 1986లో మళ్ళీ “మంచి మనసులు” (మొదటి దానితో సంబంధం లేని చిత్రం) తో నిర్మాణ రంగంలోకి తిరిగి వచ్చినా, ఈసారి అంతగా విజయం సాధించలేకపోయారు. నటిగా, నిర్మాతగా, గృహిణిగా సంతృప్తికరమైన జీవితాన్ని గడిపిన వాసంతి బి.ఎ. 2019లో చెన్నైలో కన్నుమూశారు.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

వాసంతి ఫోటో..

Vasanti Photos

Vasanti Photos

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

Follow Us