Namrata Shirodkar : మహిళలకు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన మహేష్ బాబు సతీమణి.. ఉమెన్స్ డే రోజు ఆ పని చేయాలంటున్న నమ్రత..

తాజాగా ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు ఎంపీ సంతోష్ కుమార్. వీరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా ఉన్నారు.

Namrata Shirodkar : మహిళలకు స్పెషల్ రిక్వెస్ట్ చేసిన మహేష్ బాబు సతీమణి.. ఉమెన్స్ డే రోజు ఆ పని చేయాలంటున్న నమ్రత..
Namrata
Follow us

|

Updated on: Mar 04, 2023 | 2:50 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటాలని బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అప్పుడప్పుడూ ఆయన సెలబ్రెటీలకు ఈ ఛాలెంజ్‏లు విసురుతుంటారు. అలా ఎంతోమందితో మొక్కలు నాటించారు. వారి నుంచి మరోకరి ఈ ఛాలెంజ్ వేయడంతో..వారు మొక్కలు నాటడం చేస్తుంటారు. తాజాగా ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు ఎంపీ సంతోష్ కుమార్. వీరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా ఉన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను నమ్రత స్వీకరించారు. దీంతో ఆమెకు సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. మన చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించడంలో సహాయపడటానికి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకు ముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు తనను నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు నమ్రత ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ మొక్కలు నాటాలని కోరుతున్నాను అని చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు నమ్రత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.