ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్‌

ప్రముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. క‌రోనా నుంచి కోలుకునేందుకు బాలుకి ప్లాస్మా ట్రీట్మెంట్ చేశారు ఎంజీఎం ఆస్పత్రి డాక్ట‌ర్లు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేటెస్ట్  హెల్త్ అప్‌డేట్‌
Follow us

|

Updated on: Aug 16, 2020 | 2:49 PM

ప్రముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. క‌రోనా నుంచి కోలుకునేందుకు బాలుకి ప్లాస్మా ట్రీట్మెంట్ చేశారు ఎంజీఎం ఆస్పత్రి డాక్ట‌ర్లు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఐసీయూలో లైఫ్ స‌పోర్ట్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.  రెండు రోజుల క్రితం కంటే ప్ర‌స్తుతం ఆయ‌న‌ ప‌రిస్థితి కాస్త మెరుగ్గా ఉందని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఎస్పీబీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి వదంతులు నమ్మొద్దని ఆయ‌న‌ కుమారుడు ఎస్పీ చరణ్ సూచించారు.

స్వ‌ల్ప కోవిడ్ ల‌క్ష‌ణాలతో ఎస్పీబీ ఆగ‌స్టు 5న ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పుడు త‌న ఆరోగ్యం చాలా బాగుంద‌ని, ఎవ‌రూ కంగారు ప‌డాల్సిన అవ‌సరం లేద‌ని సెల్పీ వీడియో రిలీజ్ చేశారు. అయితే గురువారం రాత్రి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి అనూహ్యంగా విష‌మించ‌డంతో ఐసీయూ‌కి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌త్యేక డాక్ట‌ర్స్ టీమ్ ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తుంది. కాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రి కూడా కరోనా బారిన ప‌డ్డారు. దీంతో ఆమెను కూడా ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఎస్పీబీ దంప‌తులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేశవ్యాప్తంగా ప్ర‌ముఖులు, సాధార‌ణ ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.

Also Read :

అలెర్ట్ : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…స‌హాయం కోసం కంట్రోల్ రూమ్ నంబ‌ర్లు

పవన్‌ అభిమాని ప్రాణానికి సీఎం జ‌గ‌న్ అభ‌యం