AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Madhu Priya : సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధుప్రియ.. కారణం ఇదే..

సింగర్ మధుప్రియ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..జానపదగీతాలతోపాటు సినిమా పాటలుకూడా పాడి అలరించింది మధుప్రియ.

Singer Madhu Priya : సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధుప్రియ.. కారణం ఇదే..
Madhu Priya
Rajeev Rayala
|

Updated on: May 22, 2021 | 4:23 PM

Share

Singer Madhu Priya : సింగర్ మధుప్రియ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..జానపదగీతాలతోపాటు సినిమా పాటలుకూడా పాడి అలరించింది మధుప్రియ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “వచ్చిండే ” అనే పాటతో ప్రేక్షకులను అలరించింది. ఆతర్వాత తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ లో పాల్గొని అందరిని ఆకట్టుకుంది. తాజాగా మధుప్రియ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. తనకు కొందరు బ్లాంక్ కాల్స్ చేసి వేధిస్తున్నారని ఆమె  ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్ షీటీమ్స్ కు ఆమె ఫిర్యాదు మెయిల్ ద్వారా చేయగా… వారు ఆమె ఫిర్యాదును సైబర్ క్రైమ్ కు బదిలీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు నిత్యం బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని, అంతే కాకుండా కొందరు సోషల్ మీడియాద్వారా అసభ్యకర మెసేజ్ లు చేసి వేధిస్తున్నారని దాంతో తాను మానసికంగా ఇబ్బందికి గురవుతున్నానని, నిందితులను కనిపెట్టి కఠినంగా శిక్షించాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మధుప్రియ ఫిర్యాదు పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 509, 354 బీ సెక్షన్ ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Corona Death: టాలీవుడ్‌లో ఆగ‌ని క‌రోనా మ‌ర‌ణాలు.. మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌రో సింగ‌ర్ మృతి..

Manchu Lakshmi: మంచి మ‌న‌సు చాటుకున్న మంచు ల‌క్ష్మి… క‌రోనాతో మ‌ర‌ణించిన వారి చిన్నారుల‌కు అండ‌గా..

Nandamuri Balakrishna: మన మధ్య ఆయన లేరనే వార్త తనను కలచివేసింది.. బీఏ రాజు మృతిపట్ల ఎమోషనల్ అయిన బాలయ్య…