AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: నేను ఆ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా.. షాకింగ్ విషయం చెప్పిన శ్రుతిహాసన్

ప్రస్తుతం శృతి నటించిన సినిమాల్లో వీరసింహారెడ్డి సినిమా నిన్న (జనవరి 12)న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కానుంది.

Shruti Haasan: నేను ఆ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా.. షాకింగ్ విషయం చెప్పిన శ్రుతిహాసన్
Shruti Haasan
Rajeev Rayala
|

Updated on: Jan 13, 2023 | 8:10 AM

Share

టాలీవుడ్ లో ప్రస్తుతం లో లీడింగ్ లో ఉన్న బ్యూటీస్ లో అందాల భామ శ్రుతిహాసన్ ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ చిన్నది. ప్రస్తుతం శృతి నటించిన సినిమాల్లో వీరసింహారెడ్డి సినిమా నిన్న (జనవరి 12)న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శ్రుతిహాసన్. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సలార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తోరూపొందుతోంది . ఇదిలా ఉంటే తాజాగాశ్రుతిహాసన్ తనకు ఉన్న ఆరోగ్య సమస్య గురించి చెప్పి షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలువురు సినీ తారలు అనారోగ్య సమ్యసలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రుతి కూడదా తనకు అనారోగ్య సమస్య ఉందని చెప్పడంతో  ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఓ సందర్భంలో శ్రుతిహాసన్ మాట్లాడుతూ.. తాను గత కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నానని తెలిపారు. అయితే తన మానసిక పరిస్థితి కోసం ఈమె ఇప్పటికే చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మానసిక సమస్య కారణంగా ఉన్నట్టుండి ఎక్కువగా ఆవేశపడటమే కాకుండా చాలా తొందరగా సహనం కోల్పోతున్నానని తెలిపారు తెలిపింది.

మొదట్లో నేను నా సమస్య గురించి బయటకు చెప్పడానికి భయపడేదాన్ని అయితే ఈ సమస్యను దాచుకోవటం వల్ల మరింత పెరిగే అవకాశం ఉందని.. అందువల్లే బయటకు చెప్పేస్తున్నా  తెలిపింది.  ఇక ఈ సమస్య ఎక్కువైతే దాన్ని కంట్రోల్ చేయడానికి సంగీతం వింటా అని తెలిపింది. నేను అనుకున్నది అనుకున్నట్టు జరగక పోతే కోపం వెంటనే వచ్చేస్తుంది. ఈ సమస్యకు చికిత్స తీసుకుంటున్నా అని తెలిపింది శ్రుతి.