Varun Sandesh: శబరిమలలో వరుణ్ సందేశ్ను తోసేసిన సెక్యూరిటీ.. వీడియో వైరల్
ప్రస్తుతం చాలామంది భక్తులు అయ్యప్ప దీక్ష స్వీకరించి నియమ నిష్టలతో స్వామి వారిని పూజిస్తున్నారు. నిత్యం అయ్యప్ప స్వామి సేవలో పునీతులవుతున్నారు. ప్రస్తుతం చాలామంది భక్తులు అయ్యప్ప దీక్ష స్వీకరించి నియమ నిష్టలతో స్వామి వారిని పూజిస్తున్నారు. నిత్యం అయ్యప్ప స్వామి సేవలో పునీతులవుతున్నారు.

హ్యాపీడేస్ సినిమాతో హీరోగా పరిచయమైన వరుణ్ సందేశ్…ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో వరుణ్ కు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత అతడు నటించిన చిత్రాలన్ని డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో నటిస్తున్న వరుణ్.. తాజాగా అయ్యప్ప మాల వేసుకున్నాడు. తన దీక్షకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. ఇటీవలే అయ్యప్ప స్వామి పడి పూజను ఘనంగా నిర్వహించాడు వరుణ్ సందేశ్. ఈ పూజా కార్యక్రమంలో అతని భార్య వితిక షేరు పాల్గొంది.
ప్రస్తుతం వరుణ్ సందేశ్- వితికా షేరు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా గతంలోనూ పలు మార్లు వరుణ్ సందేశ్ అయ్యప్ప మాలను ధరించినట్లు తెలుస్తోంది. ఇరుముడితో శబరిమల అయ్యప్ప దర్శనానికి బయలు దేరాడు వరుణ్ సందేశ్. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా వరుణ్ శబరిమల వెళ్లిన వీడియో వైరల్ గా మారింది.
స్వామి దర్శనానికి శబరిమల వెళ్లిన వరుణ్ ను అక్కడి ఆలయ సెక్యూరిటీ తోసేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. స్వామి దర్శనానికి ఆలయం లోపలికి వెళ్తున్న వరుణ్ సందేశ్ ను అక్కడి సెక్యూరిటీ సెలబ్రెటీ అని తెలియాక తోసేశారు. దాంతో వరుణ్ షాక్ అయ్యాడు. ఆతర్వాత అక్కడ ఉన్నవారి వరుణ్ గురించి చెప్పి ప్రత్యేక లైన్ లో దర్శనానికి తీసుకెళ్లారని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .








