AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej: మా అమ్మ కోసం ఈ సినిమా చేశాను.. సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇప్పుడు విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పాన్‌ ఇండియా మిస్టీక్‌ థ్రిల్లర్‌ గా ఈ సినిమా రానుంది.  బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లోని బిగ్‌స్క్రీన్‌పై ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

Sai Dharam Tej: మా అమ్మ కోసం ఈ సినిమా చేశాను.. సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Sai Dharam Tej
Rajeev Rayala
|

Updated on: Dec 07, 2022 | 6:36 PM

Share

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ విరూపాక్ష. రిపబ్లిక్ సినిమా సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్న తేజ్. ఇప్పుడు విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పాన్‌ ఇండియా మిస్టీక్‌ థ్రిల్లర్‌ గా ఈ సినిమా రానుంది. బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లోని బిగ్‌స్క్రీన్‌పై ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ఈ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన వస్తోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ సంస్థ వైవిధ్యమైన చిత్రాలు అందించే ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ..

‘మా అమ్మ కోసం ఈ సినిమా చేశాను. ఈ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌కు నా థ్యాంక్స్‌. ఆయన నాపై చూపించిన ప్రేమ మరువలేనిది. ఆయనతో నా స్నేహాన్నిఎప్పటికి కొనసాగించాలనుకుంటున్నాను. ఈ చిత్రానికి సుకుమార్‌ గారు స్క్రీన్‌ప్లే అందించడం, నిర్మాణ భాగస్వామిగా వుండటం ఎంతో సంతోషంగా వుంది. ఈ చిత్ర నిర్మాతలు నాకు ఇచ్చిన సపోర్ట్‌ మర్చిపోలేనిది అని అన్నారు.అలాగే ఈ చిత్రంతో దర్శకుడు కార్తిక్‌ దండును అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ చిత్రం అందరిని కొత్త ప్రపంచంలోకి తీసుకవెళుతుంది’ అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘.1990 నేపథ్యంలో ఫారెస్ట్‌ బేస్‌డ్‌ విలేజ్‌లో జరిగే కథ ఇది. అక్కడ జరిగే కొన్ని కొత్త, వింత పరిణామాలను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరంగా వుంటుంది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఎంతో రిచ్‌గా చిత్రాన్ని రూపొందించారు. సుకుమార్‌ లాంటి గొప్ప దర్శకుడు నా చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయి ధరమ్‌తేజ్‌ యాక్సిండెంట్‌ నుంచి కోలుకున్న తరువాత ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఎంతో కష్టపడ్డాడు. ఈ చిత్రంలో అందరూ కొత్త సాయిధరమ్‌ తేజ్‌ను చూస్తారు. ఈ చిత్రం అందరూ తప్పకుండా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన సినిమా’ అన్నారు. ఎస్వీసీసీ లాంటి గొప్ప బ్యానర్‌లో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని, తప్పకుండా అందరూ థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన గొప్ప సినిమా ఇదని ప్రొడక్షన్‌ డిజైనర్‌ నాగేంద్ర తెలిపారు. తెలుగులో రాబోతున్న మరో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ సినిమా ‘విరూపాక్ష’ అని, ఈ చిత్రం కోసం నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వడం లేదని కెమెరామెన్‌ శ్యామ్‌దత్‌ తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ,హింది, మలయాళ భాష ల్లో ఏప్రిల్‌ 21, 2023న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి