khiladi : తుది దశకు చేరుకున్న మాస్ మహారాజా మూవీ షూటింగ్… దుబాయ్ కు పయనంకానున్న ఖిలాడి టీమ్

మాస్ మహారాజా ఇటీవలే క్రాక్ సినిమాతో కెరియర్ లో చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు.

khiladi : తుది దశకు చేరుకున్న మాస్ మహారాజా మూవీ షూటింగ్... దుబాయ్ కు పయనంకానున్న ఖిలాడి టీమ్
Follow us

|

Updated on: Jun 27, 2021 | 9:06 AM

khiladi : మాస్ మహారాజా ఇటీవలే క్రాక్ సినిమాతో కెరియర్ లో చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన  క్రాక్ తో సంక్రాంతి సీజన్ లో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అదే ఊపులో ఉన్న రవితేజ.. రమేశ్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడీ చేస్తున్నాడు. డ్యూయల్ రోల్ లో నటిస్తున్న రవితేజ ఖిలాడీపై.. ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.  ఇప్పటికే ఈ సినిమా 90 శాతం చిత్రీకరణను జరుపుకుంది. మిగతా 10 శాతం షూటింగును పూర్తిచేసే పనిలో ఉన్నారు. తుది దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పుడు తిరిగి ప్రారంభించనున్నారు.  చిన్నపాటి షెడ్యూల్ ఒకటి హైద్రాబాద్ లోనే ప్లాన్ చేశారట. ముందుగా దానిని పూర్తి చేసి, ఆ తరువాత షెడ్యూల్ ను దుబాయ్ లో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఆ షెడ్యూల్ తో షూటింగు పార్టు పూర్తవుతుందట.

యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, ముఖేశ్ రుషి .. సచిన్ కేద్కర్ .. రావు రమేశ్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ప్రత్యేకమైన పాత్రలో అనసూయ మెరవనుంది.  రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.ఇదిలా ఉంటే క్రాక్ మూవీ హిట్ కావడంతో పాటు.. ట్రైలర్ తో ఖిలాడీపై అంచనాలు పెరగడంతో.. ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. అయితే అన్నింటికంటే ఎక్కువగా అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ. 45 కోట్లు ఆఫర్ చేసిందట. అయితే ఈ ఆఫర్ పై యూనిట్ ఇంతవరకు స్పందించలేదు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rare photo : మొదటి సినిమాతోనే ఫిదా చేసిన హైబ్రీడ్ పిల్ల.. సింగిల్ పీస్ చిన్నప్పటి ఫోటో.. గుర్తు పట్టారా..

Dhanush: తెలుగులో సెకండ్ సినిమాకు సిద్ధం అవుతున్న తమిళ్ స్టార్ హీరో.. నితిన్ డైరెక్టర్ తో ధనుష్ మూవీ..

Jr NTR : జోరు పెంచిన తారక్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీ.. సినిమాలతోపాటు టీవీ షో కూడా ..