AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనుంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. యానిమల్, పుష్ప 2 హిట్స్ తర్వాత ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. తెలుగుతోపాటు హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం రష్మిక తన జిమ్ లో కసరత్తులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తన కాలికి గాయమైంది.

ఆ సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనుంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక
Rashmika
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2025 | 12:59 PM

Share

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగులో పుష్ప 2 సినిమాతో భారీ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా రూ. 18 వందలకోట్లకు పైగా వసూల్ చేసి సత్తా చాటుతుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ రాణిస్తుంది. తాజాగా రష్మిక రిటైర్మెంట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇది విని చాలా మంది షాక్ అవుతున్నారు. ఇటీవల రష్మిక కాలికి గాయమైన విషయం తెలిసిందే..

రష్మిక మందన్న హిందీలో ‘గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాలు చేసింది. ఇక యానిమల్ సినిమాతో సంచలన విజయం అందుకుంది. హిందీ నిర్మాతలు రష్మిక కాల్షీట్ కోసం రేసులో ఉన్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ విక్కీ కౌశల్‌తో ‘చావా’ సినిమా చేసింది. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ పోషించాడు. శంభాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటి రష్మిక కనిపించనుంది.

ఈ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ.. సౌత్ నుంచి వచ్చి మహారాణి యేసుబాయి పాత్రలో నటించాను. ఇది నా జీవితంలో నేను చేసిన ప్రత్యేక పాత్ర. ఈ సినిమా తర్వాత రిటైర్ కావడం అవ్వాలనిపించిందని దర్శకుడు లక్ష్మణ్‌తో చెప్పాను’ అని రష్మిక తెలిపింది.

చావా ట్రైలర్ నన్ను ఆకట్టుకుంది. విక్కీ కౌశల్ దేవుడిలా కనిపిస్తున్నాడు అని తెలిపింది రష్మిక. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రష్మిక మందన్న మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. చావా తర్వాత రిటైర్ కావడం అవ్వాలనిపించిందని దర్శకుడితో చెప్పాను అని రష్మిక తెలిపింది. సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్నకు డిమాండ్ ఉంది.  ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us