Ram Gopal Varma: వివాదంలో రాంగోపాల్ వర్మ లడికి సినిమా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్జీవీ..

తాను నిర్మించిన లడికి సినిమాను ఆపాలంటూ నిర్మాత శేకర్ రాజు కోర్టులో ఫిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Ram Gopal Varma: వివాదంలో రాంగోపాల్ వర్మ లడికి సినిమా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్జీవీ..
Follow us

|

Updated on: Jul 20, 2022 | 12:21 PM

లడికి సినిమా రిలీజ్ కాకుండా కొంతమంది సంతకాలతో ఆపుతున్నారని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సినిమాను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రవికుమార్ రెడ్డి అనే వ్యక్తితోపాటు శేఖర్ రాజు, మరొక ఇద్దరు పైన ఫిర్యాదు చేశారు ఆర్జీవీ. అలాగే లడికి సినిమా విడుదలకు అడ్డుపడుతున్నారంటూ.. పూర్తి వివరాలను తెలియజేస్తూ వర్మ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

“లడికి సినిమా స్క్రీనింగ్ ఆపు చేయాలి అని ఇద్దరు దొంగ కాగితాలతో అబద్ధపు స్టేట్మెంట్లతో ఫోర్జరీ సంతకాలతో కోర్టు ద్వారా స్టే తీసుకువచ్చారు. కానీ కోర్టులో ఆ ఇద్దరి స్టేలని కొట్టివేసి నా లడికి ( అమ్మాయి ) సినిమాకి క్లియరెన్స్ ఇచ్చారు. నా సినిమాని ఇబ్బంది పెట్టాలని చూసిన వారిపై చట్టరీత్యా అనేక సెక్షన్ల కింద చర్య తీసుకోబోతున్నాను. నా కంపెనీ లెటర్ హెడ్ ని ఫోర్జరీ చేసిన ఎన్.రవి కుమార్ రెడ్డి మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు ఫైల్ చేయడమే కాకుండా రన్నింగ్ లో ఉన్న నా సినిమాను ఆపినందుకు పరువు నష్టం, నాకు జరిగిన నష్టపరిహారాన్ని కోర్టు ద్వారా వసూలు చేస్తాను. నేనే కాకుండా ప్రొడ్యూసర్స్ అయినటువంటి ఆస్ట్రీ ( Artsee media ) మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్ కూడా ఆ ఇద్దరి మీద కేసులు పెట్టబోతున్నారు. ఇక శేఖర్ రాజ్ అనే వ్యక్తి కోర్టులో అబద్ధపు స్టేట్మెంట్లతో కోర్టు వారిని మభ్య పెట్టిన విషయంలో అదే కోర్టులో ఫోర్జరీ నేరం కింద కంప్లైంట్ నమోదు చేయబోతున్నాము”. అని ప్రెస్ నోట్‏లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

తాను నిర్మించిన లడికి సినిమాను ఆపాలంటూ నిర్మాత శేకర్ రాజు కోర్టులో ఫిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మతో ఓ సినిమా చేయడం కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు ఇచ్చానని.. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా వర్మ దాటవేస్తూ వస్తున్నాడని ఫిర్యాదులో తెలిపారు శేఖర్ రాజు. ఈ విషయమై తన దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టును ఆశ్రయించానని అన్నారు. ఇదే అంశంపై ఈరోజు పంజాగుట్ట పీఎస్ లో వర్మ ఫిర్యాదు చేశారు.