తమన్నా ప్రధాన పాత్రలో.. ‘రాజు గారి గది 3’ ప్రారంభం
హారర్ కామెడీగా తెరకెక్కి టాలీవుడ్లో మంచి విజయాన్ని సాధించిన ‘రాజు గారి గది’ సిరీస్లో మూడో చిత్రం రాబోతోంది. ఓంకార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా.. అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను, హరితేజ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ […]
హారర్ కామెడీగా తెరకెక్కి టాలీవుడ్లో మంచి విజయాన్ని సాధించిన ‘రాజు గారి గది’ సిరీస్లో మూడో చిత్రం రాబోతోంది. ఓంకార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా.. అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శీను, హరితేజ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుందని దర్శకుడు ఓంకార్ వెల్లడించారు. అలాగే ఈ చిత్రానికి ప్రముఖ రచయిత బుర్రా మాధవ్ మాటలు అందిస్తుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్గా పనిచేయనున్నారని ఆయన తెలిపారు. కాగా ఓక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.