
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా.. శ్రుతిహాసన్ హీరోయిన్ గా కనిపించింది. అలాగే ఈ సినిమాలో భోజ్ పూరి నటుడు రవికిషన్ విలన్ గా నటించాడు. మద్దాలి శివ రెడ్డి అనే పాత్రలో ఆయన అద్భుతంగా నటించి మెప్పించాడు. రేసుగుర్రం సినిమాతో రవి కిషన్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత ఆయన చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవి కిషన్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఎంపీగా సేవలందిస్తున్నాడు. తాజాగా ఆయన తన తండ్రి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా రవి కిషన్ మాట్లాడుతూ.. మా నాన్నకు కోపం ఎక్కుక్కువ.. నన్ను ఎప్పుడూ కొడుతూనే ఉండేవాడు. చావబాదేవాడు.. సింపుల్ గా చెప్పాలంటే చంపడానికి కూడా వెనకాడేవాడు కాదు అని అన్నారు రవికిషన్. ఒక రోజు నన్ను చంపాలని చూశారు. దాంతో మా అమ్మ నన్ను పారిపొమ్మని చెప్పింది. దాంతో వెంటనే నేను 500 జేబులో పెట్టుకొని ముంబై ట్రైన్ ఎక్కాను అని తెలిపారు రవికిషన్.
మా నాన్న కోపంలో కారణం ఉంది అని తెలిపారు రవికిషన్. మా నాన్న ఒక పూజారి. తనలానే తన కొడుకు కూడా పూజారి అవ్వాలని అనుకున్నారు. పూజారి కాకపోతే.. వ్యవసాయం, లేదా ప్రభుత్వ ఉద్యోగి అవ్వాలని ఆశపడ్డారు. ఆయన కుటుంబంలో ఒక నటుడు పుడతాడని అనుకోలేదు. ఒకసారి నేను సీత గెటప్ లో డాన్స్ చేస్తూ మా నాన్నకు కనిపించాను. అప్పుడు నన్ను చావ బాదాడు. ఆయన కొట్టిన దెబ్బలే నాకు జీవితం అంటే ఏంటో నేర్పించాయి. ఇప్పుడు రవికిషన్ ఇలా మీ ముందు నిలుచున్నా .. నేను నటుడు అయిన తర్వాత చాలా గర్వపడ్డారు. చనిపోయేముందు కూడా నిన్ను చూసి గర్వపడుతున్నా అని చెప్పారు అని రవికిషన్ చెప్పుకొచ్చారు.
आज गोरखपुर ग्रामीण विधानसभा में भारतीय जनता पार्टी खोराबार मंडल की संगठनात्मक बैठक में भाजपा गोरखपुर महानगर के जिलाध्यक्ष श्री राजेश गुप्ता जी एवं गोरखपुर ग्रामीण विधानसभा के लोकप्रिय विधायक श्री विपिन सिंह जी के साथ सम्मिलित हुआ#PhirEkBaarModiSarkar pic.twitter.com/StcmLBwnij
— Ravi Kishan (Modi Ka Parivar) (@ravikishann) March 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.