Amitabh Bachchan: అంతా అబద్ధం.. నేను బాగానే ఉన్నాను.! అమితాబ్ క్లారిటి వీడియో.
బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ అస్వస్థత కారణంగా ముంబయి కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారని, ఆయన కాలిలో రక్తం గడ్డ కట్టిన కారణంగా ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించినట్టు మార్చి 15న సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా దీనిపై అమితాబ్ బచ్చన్ స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలలో నిజం లేదనీ, బిగ్బీ స్పష్టం చేశారు.
బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ అస్వస్థత కారణంగా ముంబయి కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారని, ఆయన కాలిలో రక్తం గడ్డ కట్టిన కారణంగా ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించినట్టు మార్చి 15న సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా దీనిపై అమితాబ్ బచ్చన్ స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలలో నిజం లేదనీ, బిగ్బీ స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ISPL ఫైనల్స్కు హాజరయ్యారు. అక్కడి మీడియా ప్రతినిధులు అమితాబ్ మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగడంతో.. తాను బాగానే ఉన్నానని, తన అనారోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్’ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. అమితాబ్ ISPL ఫైనల్స్లో హుషారుగా పాల్గొని సందడి చేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్తో కలిసి మ్యాచ్ను వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఎక్స్లో వైరల్ అవుతున్నాయి. అమితాబ్ ప్రస్తుతం బాలీవుడ్తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘కల్కి 2898 ఏడీ’ లో కీలకపాత్రలో కనిపించనున్నారు. మే9న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టి.జి. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తోన్న ‘తలైవా 170’ లోనూ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.