Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయి కొర్రపాటి..బ్యాక్ టూ ట్రాక్ !

సాయి కొర్రపాటి.. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా సత్తా చాటారు. బడా సినిమాాలతో పాటు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలలను కూడా ప్రమోట్ చేస్తారని ఈయనకు పేరుంది.

సాయి కొర్రపాటి..బ్యాక్ టూ ట్రాక్ !
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 25, 2020 | 5:11 PM

సాయి కొర్రపాటి.. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా సత్తా చాటారు. బడా సినిమాాలతో పాటు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలలను కూడా ప్రమోట్ చేస్తారని ఈయనకు పేరుంది. ‘ఈగ’ లాంటి బ్లాక్‌బాస్టర్ సినిమాతో‌ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సాయి కొర్రపాటి.. రాజమౌళితో కలిసి ‘అందాల రాక్షసి’ సినిమాను నిర్మించాడు. అలాగే రాజమౌళి దగ్గర పనిచేసిన త్రికోఠిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమాను నిర్మించాడు. ఈయన దర్శక ధీరుడు రాజమౌళికి బెస్ట్ ఫ్రెండ్ అని చాలా మందికి తెలిసి ఉండదు. అందుకే సాయి కొర్రపాటి నిర్మించే సినిమాలకు రాజమౌళి అతిథిగా వచ్చి ప్రమోట్ చేసేవాడు. ఆ సినిమాలను ప్రమోట్ చేసేవాడు. అయితే ఒక దశలో నిర్మించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో సాయి కొర్రపాటి ప్రొడక్షన్ ఆపేశాడు. చివరగా ఆయన్నుంచి వచ్చిన సినిమా ‘యుద్ధం శరణం’. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది

మధ్యలో ‘కేజీఎఫ్’ సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం మినహాయిస్తే సొంతంగా అయితే సాయి సినిమాలు నిర్మించలేదు. ఐతే కొంత గ్యాప్ అనంతరం ఆయన మళ్లీ ప్రొడక్షన్లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. ఐతే ఈసారి కూడా ఆయన రాజమౌళి ఫ్యామిలీతోనే ఆయన కలిసి పనిచేయనున్నాారు. కీరవాణి చిన్న కొడుకు సింహాను హీరోగా పెట్టి సినిమా తీయబోతున్నాడట. ఓ కొత్త డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట. కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తాడట. మరీ రీఎంట్రీలో అయినా సాయి కొర్రపాటి తిరిగి ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి.

Also Read :

యాంజియోప్లాస్టీ సక్సెస్.. కపిల్ డిశ్చార్జ్‌

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ