కాళ్లతో థ్యాంక్స్ చెప్పిన పూజా హెగ్డే..ఎందుకంటే..?
ప్రజంట్ టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ గేర్ లో దూసుకుపోతుంది అందాల భామ పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ ఇన్స్టా ఫాలోవర్స్ 11 మిలియన్లు క్రాస్ అయ్యారు. దీంతో అందరిలా కాకుండా కాస్త భిన్నంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంది పూజా.

ప్రజంట్ టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ గేర్ లో దూసుకుపోతుంది అందాల భామ పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ ఇన్స్టా ఫాలోవర్స్ 11 మిలియన్లు క్రాస్ అయ్యారు. దీంతో అందరిలా కాకుండా కాస్త భిన్నంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంది పూజా. తన రెండు కాళ్లను ఉపయోగించి 11 అంకె వచ్చేలా చేసి..విభిన్నతను చాటుకుంది. ఆ ఫొటోను పోస్ట్ చేసి, అలా చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది.
“ఈ ఏడాది స్టార్టింగ్ నుంచి నా కాళ్ల గురించే మాట్లాడుకున్నారు(మీకు తెలుసని భావిస్తున్నా). అందుకే ఇలా వైవిధ్యంగా వాటి ద్వారానే పోస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నా. ఎప్పట్లానే ప్రేమ, అభిమానంతో నా పోస్టుల ద్వారా మిమ్మల్ని అలరించేందుకు ప్రయత్నిస్తా. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను సదా గౌరవిస్తాను” అని పేర్కొంది పూజా హెగ్డే.
ఈ సంవత్సరం స్టార్టింగ్ లో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో అలరించిన పూజా హెగ్డే.. ప్రజంట్ బాహుబలి ప్రభాస్తో ‘రాధేశ్యామ్’లో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేయగా, ఫ్యాన్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. దీనితో పాటే అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లోనూ హీరోయిన్గా నటిస్తోంది.




