AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్కీఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే.. మహేశ్ బాబు సరనస నటించనున్న బుట్టబోమ్మ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..

Pooja Hegde: 'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్‏కు హీరోయిన్‏గా పరిచమై.. అతి తక్కువ కాలంలో అగ్ర హీరోల సరసన నటిస్తూ.. టాప్ హీరోయిన్‏గా ఎదిగింది పూజా హెగ్డే. అక్కినేని నాగచైతన్యకు

లక్కీఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే.. మహేశ్ బాబు సరనస నటించనున్న బుట్టబోమ్మ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..
అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాలో తన  పిచ్చేక్కించింది పూజ
Rajitha Chanti
|

Updated on: Apr 08, 2021 | 8:25 PM

Share

Pooja Hegde: ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‏కు హీరోయిన్‏గా పరిచమై.. అతి తక్కువ కాలంలో అగ్ర హీరోల సరసన నటిస్తూ.. టాప్ హీరోయిన్‏గా ఎదిగింది పూజా హెగ్డే. అక్కినేని నాగచైతన్యకు జోడీగా నటించిన పూజా.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా మారిపోయింది. పాన్ స్టార్ ప్రభాస్‏కు జోడీగా రాధేశ్యామ్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అటు ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకొని.. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతేకాకుండా.. మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో చరణ్ సరసన ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇవే కాకుండా.. అక్కినేని అఖిల్ సరసన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటు తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ వరుస ఆఫర్లను అందుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ అమ్మడు మరో సూపర్ లక్కీ ఛాన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫుల్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏తోపాటు అందమైన ప్రేమకథ చిత్రంగా తెరకెక్కించబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటించబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే పూజాతో చిత్రయూనిట్ చర్చలు జరిపినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక పూజా కూడా సానుకూలంగానే స్పందించిన్నట్లుగా తెలుస్తోంది. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ వర్కింగ్ టైటిల్‌గా రూపొందనున్న ఈ సినిమాని హారిక అండ్‌ హాసిని సంస్థలు, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్ సహకారంతో నిర్మించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. గతంలో త్రివిక్రమ్ మహేష్ కాంబోలో అతడు, ఖలేజా వంటి చిత్రాలు విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాడు. మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండడంతో ఈ మూవీ పై అంచనాలు పెంచుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం మహేష్.. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అటు పూజా తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో కూడా చేస్తుంది.

Also Read: Jabardasth Vinod: పోలీసులను ఆశ్రయించిన జబర్థస్త్ వినోద్.. అతనిపై ఫిర్యాదు.. న్యాయం చేయాలని కోరిన కమెడియన్..

రోడ్డెక్కిన ‘కార్తీకదీపం’.. డాక్టర్ బాబు.. వంటలక్క కలవాలంటూ ఫ్లెక్సీలు.. ఎక్కడో తెలుసా..