యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం జరిగిన సంగతి తెలిసిందే. నాగార్జున ఇంట్లో జరిగిన ఈ వేడుకకు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వీరిద్దరి నిశ్చితార్థం వేడుకను అధికారికంగా ప్రకటిస్తూ.. ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేశారు నాగార్జున. దీంతో వీరిద్దరికి అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. చైతన్య, శోభితా నిశ్చితార్థంతో తామంతా సంతోషంగా ఉన్నామని అన్నారు నాగార్జున. విడాకుల తర్వాత చైతన్య ఎంతో బాధపడ్డారని అన్నారు. అలాగే చైతన్య, శోభితా పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగార్జున.
నాగార్జున మాట్లాడుతూ.. “విడాకుల తర్వాత చైతన్య చాలా బాధపడ్డారు. కానీ తన బాధను ఎవరితోనూ పంచుకోలేదు” అని అన్నారు. కానీ ఇప్పుడు తన తనయుడు తిరిగి సంతోషంగా ఉండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. కొన్ని రోజులుగా చైతన్య, శోభితా ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ నెట్టింట వైరలయ్యాయి. ఈ క్రమంలోనే ఇద్దరికి సంబంధించిన ఫోటోస్ కూడా నెట్టింట వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరిస్తుంది. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ గురువారం ఆగస్ట్ 8న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.
గతంలో నాగచైతన్యకు హీరోయిన్ సమంతతో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఒంటరిగా ఉన్న చైతూకు శోభితాతో పరిచయం ఏర్పడింది. శోభితా 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచింది. 2016లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తుంది.
"We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.