AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi : ఊటీలో ప్లేస్ కొన్న మెగాస్టార్.. ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..

చిరంజీవికి ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇప్పుడు ఊటీలో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర వింటే షాక్ అవుతారు. చిరంజీవికి హైదరాబాద్‌లో ఇల్లు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు చాలా ఆస్తులున్నాయి. అదేవిధంగా బెంగళూరు శివార్లలో చిరంజీవికి ఫామ్‌హౌస్ ఉంది.

Megastar Chiranjeevi : ఊటీలో ప్లేస్ కొన్న మెగాస్టార్.. ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే..
Chiranjeevi
Rajeev Rayala
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Oct 12, 2024 | 7:25 AM

Share

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా.. ఆతర్వాత సుప్రీం హీరోగా.. ఆపై మెగా స్టార్ గా ఎదిగారు చిరంజీవి.  ఇక చిరంజీవికి వందల కోట్ల ఆస్థి ఉంది. వందల కోట్ల రూపాయల ఆస్తులు ఆయన సొంతం. చిరంజీవికి ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇప్పుడు ఊటీలో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర వింటే షాక్ అవుతారు. చిరంజీవికి హైదరాబాద్‌లో ఇల్లు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు చాలా ఆస్తులున్నాయి. అదేవిధంగా బెంగళూరు శివార్లలో చిరంజీవికి ఫామ్‌హౌస్ ఉంది. టైం పాస్ చేయడానికి తరచూ ఇక్కడికి వస్తుంటారు. చిరంజీవి ఈఅలాగే కొన్ని పండగల సమయంలో ఫ్యామిలీతో ఇక్కడ గడుపుతూ ఉంటారు. ఇప్పుడు చిరంజీవి ఊటీలో భూమి కొన్నారు. తమిళనాడులోని ఈ కొండ ప్రాంతంలో ఆయన స్థలం కొన్నారు.

ఊటీలోని కొండ ప్రాంతంలో చిరంజీవి ఈ భూమిని కొనుగోలు చేశారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ స్థలం కోసం ఆయన రూ.16 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే ఎకరాకు 2.6 కోట్ల రూపాయలు చెల్లించారు.చిరంజీవి ఈ భూమిని కొనడానికి కారణం ఉంది. ఇక్కడ ఫామ్‌హౌస్ నిర్మించాలని ఆలోచిస్తున్నారు. రామ్ చరణ్ మరియు అతని భార్య ఉపాసన ఇప్పటికే ఇక్కడ స్థలాలు కొనాలనే ఆలోచనలోనూ ఉన్నారు.

చిరంజీవి సినిమాలు ఇటీవల ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంబరం’ సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.