AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Vishnu: మంచు విష్ణు సంచలన నిర్ణయం.. ప్రకాష్‌ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదం

'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  'మా' ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాష్‌ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదించారు.

Manchu Vishnu: మంచు విష్ణు సంచలన నిర్ణయం.. ప్రకాష్‌ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదం
Manchu Vishnu
Ram Naramaneni
|

Updated on: Dec 12, 2021 | 1:15 PM

Share

‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ‘మా’ ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాష్‌ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదించారు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీ‌కాంత్‌, ఉత్తేజ్ స‌హా మొత్తం 11 మంది స‌భ్యులు రాజీనామా చేశారు. రాజీనామాలు చేయొద్దని కోరినా, వెనక్కి తీసుకోమన్నా వాళ్లు అంగీకరించలేదని.. అందుకే ఆమోదించామని క్లారిటీ ఇచ్చారు విష్ణు. అయితే ప్రకాష్‌ రాజ్‌, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ వాళ్ల రిజైన్లను మాత్రం ఆమోదించలేదన్నారు విష్ణు. ‘మా’ బిల్డింగ్‌పై చర్చలు జరుగుతున్నాయని.. వారం, పదిరోజుల్లో నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామన్నారు.

‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు గెలిపొందారని ఈసీ అనౌన్స్‌ చేసిన మరుసటి రోజే తన ‘మా’ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకోనున్నట్టు ప్రెస్‌ మీట్ పెట్టి మరీ చెప్పిన ప్రకాశ్‌… ఆ తరువాత తన ప్యానెల్‌ నుంచి గెలిచిన వారు కూడా పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి… బెదిరించి… డబ్బుతో ఓటర్లను ఆకర్షించి గెలిచారని మీడియా వేదికగా విష్ణుపై ఫైర్ అయ్యారు.  అయితే ప్రకాశ్‌ అండ్‌ టీం రాజీనామాలపై అప్పట్లోనే స్పందించిన విష్ణు.. వారి రాజీనామాలను స్వీకరించేది లేదని మీడియా ముఖంగా చెప్పారు. ఓటమి బాధలో నిర్ణయం తీసుకున్నారంటూ పెద్దరికంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు.

కానీ ఉన్నట్టుండి.. తాజాగా ప్రకాశ్‌ రాజ్ ప్యానల్లో గెలిచిన అభ్యర్థుల రాజీనామాలను విష్ణు ఆమోదించారు. ఇక ‘మా’ ప్యానల్లో వారు ఉండలేరని తేల్చి చెప్పారు.

Also Read: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. విజయనగరం జిల్లాలో నిర్ధారణ

ఈ ఫోటోలోని చిన్నారి.. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఎవరో గుర్తించారా..?