ఆ ఇద్దరూ నాకు విలన్లుగా నటించారు.. ఇప్పుడు పెద్ద హీరోలు అయ్యారు
ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో నటుడిగా ప్రేక్షకులను అలరించారు నటుడు జి.వి నారాయణ రావు. 1976లో అంతులేని కథ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సహాయ నటుడిగా తనదైన ముద్ర వేశారు .

సీనియర్ నటుడు జీవీ నారాయణరావు ఇటీవలే కన్నుమూశారు. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలను, మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ వంటి అగ్ర తారలతో తనకున్న అనుబంధాన్ని, అలాగే కళాత్మక చిత్రాల పట్ల తనకున్న అంకితభావాన్ని ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన హీరోగా నటించిన సమయంలో, రజినీకాంత్, చిరంజీవి విలన్లుగా చేశారని వెల్లడించారు. ఈ విషయం ఈ తరం ప్రేక్షకులకు తెలియదని, వారిద్దరూ విలన్ పాత్రల నుంచే తమ కెరీర్ను ప్రారంభించారని నారాయణరావు స్పష్టం చేశారు. మోహన్ బాబు వంటి ఇతర నటులు కూడా ఇలాగే మొదలుపెట్టారని గుర్తు చేశారు.
ఆ హీరో అర్ధరాత్రి అడవి మధ్యలో నాకు నాటుకోడి కావాలి అని అడిగాడు.. నేను షాక్ అయ్యా
రజినీకాంత్తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ఇద్దరూ ఒకే రోజు ఇండస్ట్రీకి వచ్చారని, అంతులేని కథ చిత్రంతో కలిసి అరంగేట్రం చేశామని తెలిపారు. ఆ తర్వాత చిలకమ్మ చెప్పింది చిత్రంలో కూడా రజినీకాంత్తో నటించానని పేర్కొన్నారు. చిరంజీవితో కుక్కకాటుకి చెప్పు దెబ్బ చిత్రంలో మొదటిసారి కలిసి నటించినట్లు, ఆ చిత్రంలో చిరంజీవి విలన్గా కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు. చిరంజీవితో తాను రూమ్మేట్స్గా ఉన్నానని, వారితో చాలా సాన్నిహిత్యం ఉందని తెలిపారు.
అతను చాలా మంచి మనిషి..! అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..
ఆ తర్వాత, జీవీ నారాయణరావు లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) గారితో మూడు సూపర్ హిట్ చిత్రాలలో నటించడం తన అదృష్టంగా భావించారు. ఆలు మగలులో ఆయన కొడుకుగా, బహుదూర బాటసారిలో అల్లుడిగా, సీతారామయ్యగారి మనవరాలులో అల్లుడిగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఈ మూడు సినిమాలు సిల్వర్ జూబ్లీలు జరుపుకున్నాయని తెలిపారు. తక్కువ సినిమాలు చేసినప్పటికీ, తన కెరీర్లో ఎక్కువ హిట్లు ఉన్నాయని ఆయన సంతోషంగా చెప్పారు.
16 ఏళ్లకే ఎంట్రీ 26ఏళ్లకే కెరీర్ క్లోజ్..! పెళ్ళైన 15 రోజులకే పారిపోయిన భర్త..!! ఈ హీరోయిన్ లైఫ్ లో సినిమాకు మించిన ట్విస్ట్లు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




