మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు పవన్ కల్యాణ్. అయితే తనదైన యాక్టింగ్ అండ్ మేనరిజమ్స్తో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా’ అంటూ అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకైన పాత్ర పోషించాడు. ఇదేక్రమంలో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశాడు. జనసేనానిగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలా స్టార్ హీరోగా, పొలిటికల్ లీడర్గా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు పవన్. ఇదిలా ఉంటే పవన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటి (మార్చి 11)తో 27 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. అలాగే జనసేన పార్టీ ఆవిర్భావం జరిగి ఈనెల 14 నాటికి 9 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని పలువురు దర్శక నిర్మాతలు పవర్స్టార్కు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఈక్రమంలో ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘పవన్ మనసేమో ప్రజల మీద.. తనువేమో వెండితెర మీద. రెండింటిలోనూ ప్రజల మనసులు చూరగొన్న పవన్ కల్యాణ్ 27 సంవత్సరాలు సినీ జీవితాన్ని.. తొమ్మిదేళ్ల రాజకీయ రంగ ప్రవేశాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. ఆయన ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను’ అని రత్నం చెప్పుకొచ్చారు. ఈ వీడియోను జనసేన ట్విట్టర్లో షేర్ చేసింది. దీంతో రత్నం వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి. కాగా పవన్తో గతంలో ఖుషీ, బంగారం వంటి హిట్ సినిమాలను నిర్మించారు ఎం.ఎమ్.రత్నం. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో మూడోసారి ముచ్చటగా హరిహర వీరమల్లు రాబోతుంది. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సగ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
దిగ్విజయభేరి !
శ్రీ పవన్ కళ్యాణ్ గారి 27 ఏళ్ల సినీ ప్రస్థానం, జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం గురించి అగ్ర నిర్మాత శ్రీ ఎ.ఎం. రత్నం గారు
Producer AM Ratnam garu about 27 years of Sri @PawanKalyan garu’s film career & JanaSena’s 10th formation day. #27YearsOfPawanKalyan pic.twitter.com/eJl8e11F0u
— JanaSena Party (@JanaSenaParty) March 10, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..