సాధారణంగా మన సినిమా తారలు సినిమాలతో పాటు యాడ్స్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఎప్పటినుంచో ఏదో ఒక బ్యూటీ ప్రొడక్ట్స్ కు సంబంధించి యాడ్స్ చేస్తూనే ఉన్నారు. దీని ద్వారా వారికి ఆదాయంతో పాటు మంచి ఫేమ్, పాపులారిటీ వస్తాయి. అలా తాజాగా టాలీవుడ్ కు చెందిన అలనాటి హీరోయిన్ తన పాత ఫొటోలను కలిసి ఓ వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఆ హీరోయిన్ చేసిన యాడ్ కు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. వీటిని చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఆ హీరోయిన్ యాడ్స్ లో కూడా నటించిందా? అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యాడ్ ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? రెగ్యులర్ గా సినిమాలు చూసే వారు ఈ అందాల తారను కనిపెట్టే ఉంటారనకుంటా? ఈమె మరెవరో కాదు పవన్ కల్యాణ్ మాజీ భార్య , ప్రముఖ నటి రేణు దేశాయ్. సినిమాల్లోకి రాక ముందు రేణు దేశాయో మోడలింగ్ కూడా చేసింది. అందులో భాగంగానే పియర్స్ సోప్ యాడ్ కూడా చేసింది. అప్పటి ఫొటోలనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. అవి కాస్తా వైరల్ గా మారాయి.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000లో బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. జానీ సినిమాలోనూ నటించిన ఆమె తమిళంలో జేమ్స్ పండు సినిమాలోనూ మెరిసింది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. కేవలం నటిగానే కాదు నిర్మాతగా, డైరెక్టర్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా సత్తా చాటింది రేణు దేశాయ్. మరాఠిలో ఇష్క్ వాలా లవ్ అనే సినిమాకు దర్శకత్వం వహించింది. అలాగే నిర్మాతగానూ వ్యవహరించింది. కాగా గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావుతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది రేణు. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి పేరొచ్చింది. దీంతో మళ్లీ ఆమె సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్న ఆమె సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది.
తమ ఇంటికి వచ్చిన రేణుదేశాయ్ ని మంత్రి సురేఖ గారు నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు.సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని మంత్రి రేణు దేశాయ్ కి తన స్వహస్తాలతో అలంకరించారు. కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణు దేశాయ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. pic.twitter.com/aFTEClhaxk
— Konda Surekha (@IKondaSurekha) July 26, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.